Cheetahs : ఆఫ్రికా నుంచి భారత్‌కు మరో 8 చీతాలు రాక

Read Time:  1 min
8 more cheetahs arrived in India from Africa
8 more cheetahs arrived in India from Africa
FONT SIZE
GET APP

Cheetahs : భారత్‌కు దక్షిణ ఆఫ్రికాలోని బోట్స్‌వానా నుంచి మరో 8 చీతాలు రానున్నాయి. రెండు విడతల్లో బోట్స్‌వానా నుంచి రానున్నట్లు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి జాతీయ పులుల సంరక్షణ అథారిటీ సమాచారం ఇచ్చింది. మేలో 4 చీతాలు భారత్‌కు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. తర్వాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్, రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో భోపాల్‌లో జరిగిన చిరుత ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో ఎన్‌టీసీఏ అధికారులు ఈవిషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఆఫ్రికా నుంచి భారత్‌కు మరో 8

ఇప్పటివరకు రూ.112 కోట్లకు పైగా ఖర్చు

దేశంలో చిరుత ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకు రూ.112 కోట్లకు పైగా ఖర్చు చేశామని, అందులో 67 శాతం మధ్యప్రదేశ్‌లో చిరుత పునరావాసానికి వెళ్లిందని అధికారులు తెలియజేశారు. ‘ప్రాజెక్ట్ చీతా’ కింద చిరుతలను రాజస్థాన్ సరిహద్దును ఆనుకొని ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యంలోకి దశలవారీగా తరలించనున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి మధ్యప్రదేశ్‌.. రాజస్థాన్ మధ్య అంతర్-రాష్ట్ర చిరుత సంరక్షణ ప్రాంతాన్ని ఏర్పాటుచేయడానికి సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరిందని తెలిపారు.

Read Also : కొత్త ఆధార్‌ యాప్‌ వాడడం చాల ఈజీ

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.