📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

బీజేపీలో చేరిన 8 మంది ఆప్‌ మాజీ ఎమ్మెల్యేలు

Author Icon By sumalatha chinthakayala
Updated: February 1, 2025 • 9:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉన్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి గట్టిదెబ్బ పడింది. ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేసిన 8 మంది ఎమ్మెల్యేలు శనివారంనాడు బీజేపీలో చేరారు. వీరితో పాటు పలువురు కౌన్సిలర్లు సైతం బీజేపీ కండువా కప్పుకున్నారు. వందన గౌర్ (పాలం), రోహిత్ మెహ్రౌలియా (త్రిలోక్‌పురి), గిరీష్ సోని (మాదిపూర్), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), రాజేష్ రిషి (ఉత్తం నగర్), బీఎస్ జూన్ (బిజ్వాసన్), నరేష్ యాదవ్ (మెహ్రౌలి), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్) కాషాయ కండువా కప్పుకున్నారు.

బీజేపీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యేలలో భావన కౌర్ రెండు సార్లు పాలమ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవగా, మదన్‌లాల్ మూడుసార్లు కస్తూర్బా నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గిరిష్ సోని మూడుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యే కాగా, రాజేష్ రిషి రెండుసార్లు ఎన్నికయ్యారు. వీరితో పాటు నరేష్ యాదవ్, పవన్ శర్మ, బీఎస్ జూన్, రోహిత్ మెహ్రోలియా, బిజేంద్ర గార్గ్ బీజేపీలో చేరారు. ఆప్ కౌన్సిలర్ జయ్ రాయ్ సైతం కమలం గూటికి చేరారు.

ఆప్ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందని, అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి పార్టీ టిక్కెట్ దక్కలేదు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామ చేసిన ఎమ్మెల్యేలంతా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఢిల్లీ బీజేపీ ఇన్‌చార్జి బైజంయత్ పాండ, ఢిల్లీ బీజేపీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ సమక్షంలో ఆ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన నేతలకు పాండ స్వాగతం పలికారు. అప్‌దా నుంచి నేతలు విముక్తి పొందడం చారిత్రకమని, ఢిల్లీ 5న జరిగే ఎన్నికలతో ఆప్‌దా నుంచి ఢిల్లీ సైతం విముక్తి పొందుతుందని పాండ అన్నారు. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్, ఫిబ్రవరి 8న కౌంటింగ్ జరుగుతుంది.

8 former AAP MLAs app BJP Party ticket Virendra Sachdeva

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.