71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల (71st National Film Awards) ప్రదానోత్సవం సెప్టెంబర్ 23, 2025న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అట్టహాసంగా జరగబోతోంది. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా విజేతల జాబితా ఇప్పటికే ప్రకటించబడగా, ఆ అవార్డులను గౌరవప్రదంగా అందించే వేడుక కోసం సినీ పరిశ్రమ అంతా ఎదురుచూస్తోంది.
ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President of India Draupadi Murmu) ముఖ్య అతిథిగా హాజరై, వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్న విజేతలకు స్వయంగా పురస్కారాలను అందజేయనున్నారు. దేశంలో సినీ రంగం (Film Industry) ఎంతటి ప్రతిష్ఠాత్మక స్థాయికి చేరుకుందో సూచించేలా ఈ వేడుక ప్రతిసారీ విశేష ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఏడాది ప్రత్యేకంగా బాలీవుడ్తో పాటు దక్షిణాది, ఇతర భాషల సినిమాల ప్రతినిధులు కూడా హాజరుకాబోతుండటంతో జాతీయ స్థాయి వైభవం మరింత పెరిగే అవకాశముంది.
రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా
అయితే ఈ వేడుకకు అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తో పాటు బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ, విక్రాంత్ మస్సే (Vikrant Massey) అలాగే ఇతర భాషల నుంచి పలువురు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది.ఈ ఏడాది ‘జవాన్’ సినిమాకు గానూ షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా, ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమాకు రాణి ముఖర్జీ (Rani Mukherjee) ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాలను అందుకోబోతున్న విషయం తెలిసిందే. షారుఖ్ తన 33 ఏళ్ల కెరీర్లో తొలిసారి ఈ అవార్డును గెలుచుకోబోతుండగా.. ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్, ’12th ఫెయిల్’ సినిమాకు గానూ విక్రాంత్ మాస్సేతో కలిసి ఈ అవార్డును పంచుకుంటున్నారు.
అలాగే ఈ వేడుకలో ’12th ఫెయిల్’ చిత్రానికి ఉత్తమ చలనచిత్ర పురస్కారం, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రానికి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం పురస్కారం దక్కనున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు సుదీప్తో సేన్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోనున్నారు. తెలుగు నుంచి బలగం సినిమాకు అవార్డు గెలుచుకున్న సింగర్ కాసర్ల శ్యామ్తో పాటు భగవంత్ కేసరి టీమ్, బేబీ టీమ్ సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: