📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

లడ్డూ మహోత్సవంలో విషాదం.. ఏడుగురు మృతి

Author Icon By sumalatha chinthakayala
Updated: January 28, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మంగళ వారం రోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. బాగ్‌పత్‌ లో ఆదినాథుడి ఆలయంలో నిర్వహిస్తున్న నిర్వాణ లడ్డూ ఉత్సవంలో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. వెదురు, కలప చెక్కతో చేసిన ఈ వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోగా.. ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే 60 మందికి పైగా ప్రజలు తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఇందులో మహిళలు, చిన్నారులు సహా వృద్ధులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఉత్తర ప్రదేశ్ బాగ్‌పత్‌లోని ఆదినాథుడి ఆలయంలో నిర్వాణ లడ్డూ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎంతో ఘనంగా చేస్తున్న ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వస్తుంటారు. ముఖ్యంగా మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు. ఈక్రమంలోనే నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వెదురు, కలప చెక్కలతో వేదికను నిర్మించారు. అయితే ఈరోజు ఎక్కువ మంది భక్తులు ఉత్సవం పాల్గొనడం.. దాదాపు 60 మంది వరకు భక్తులు వేదికపైకి ఎక్కారు.

దీంతో బరువు ఆపలేకపోయిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో భక్తులు అంతా కింద పడిపోయారు. ఐదుగురు ప్రజలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా భక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే సహాయ చర్యలు అందించారు. ఒక్కొక్కరినీ బయటకు తీసుకు వస్తూనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతులతో పాటు క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

Baghpat Laddoo Mahotsav Platform Collapses Uttar Pradesh Wooden Stage

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.