📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

Author Icon By Sudheer
Updated: December 19, 2024 • 6:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలో గురువారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నిఘా వర్గాల సమాచారం మేరకు బుధవారం రాత్రి నుంచే భద్రతా దళాలు సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల దాడికి భద్రతా దళాలు సమర్థవంతంగా ప్రతిగా ఇచ్చాయి.

సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా వర్గాలు సమాచారం అందించాయి. వెంటనే ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. గురువారం ఉదయం ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించడంతో ఎదురు కాల్పులు జరగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

ఈ ఘటనలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికులను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఘటనాస్థలంలో ఇంకా శోధన కొనసాగుతుండటంతో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భద్రతా బలగాల విజయంలో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు భద్రతా బలగాలు చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో భద్రతా బలగాల చురుకైన చర్యలు ప్రాంతీయ శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

5 terrorists killed encounter jammu kashmir

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.