📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

అయ్యో చేప ఎంత పని చేసింది..చెయ్యి కోల్పోవాల్సి వచ్చింది.

Author Icon By Anusha
Updated: March 13, 2025 • 2:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేరళ రాష్ట్రం తలస్సేరీ ప్రాంతంలో చేప కరవడంతో ఒక రైతు తన అరచేతిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటగా చిన్న గాయంగా అనిపించినా, అది తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు దారి తీసి చివరికి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది.కన్నూర్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల టి. రాజేశ్ అనే రైతు తన పొలంలోని ఒక చిన్న నీటి గుంటను శుభ్రం చేస్తున్న సమయంలో, “కడు” అనే జాతికి చెందిన చేప అతని కుడి చేతి వేలిని కొరికింది. ఆ కరిచిన ప్రదేశంలో చిన్న గాయమైందని భావించిన రాజేశ్, దానిని లైట్ తీసుకుని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ సి) కు వెళ్లి ప్రాథమిక చికిత్స పొందాడు. అక్కడ ఇచ్చిన మందులు వేసుకున్నప్పటికీ, గాయం తగ్గలేదు.కొద్దిరోజులకు రాజేశ్ చేయిలో తీవ్రమైన నొప్పి మొదలైంది.అరచేతిపై బొబ్బలు కూడా వచ్చాయి. గాయంను తక్కువగా అంచనా వేసిన అతడు, నొప్పి పెరిగాక దగ్గర్లోని మహే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. కానీ అక్కడి వైద్యులు గాయానికి సరైన కారణం తెలియక, కోజికోడ్ బేబీ మెమోరియల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

చేప కొరకడంతో

నీటి గుంటను శుభ్రం చేస్తున్న సమయంలో, “కడు” అనే జాతికి చెందిన చేప అతని కుడి చేతి వేలిని కొరికింది. బేబీ మెమోరియల్ వైద్యులు రాజేశ్​కు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి,అతనికి గ్యాస్ గ్యాంగ్రీన్​ అనే బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్  సోకిందని నిర్ధారించారు. చేతి వేళ్లను తొలగించకపోతే ఆ బ్యాక్టీరియా పైకి పాకి మరింత సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దీంతో అతడి సమ్మతి మేరకు రాజేశ్​ చేతి వేళ్లను తొలగించారు డాక్టర్లు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇన్ఫెక్షన్ ఇంకాస్త పైకి వ్యాప్తించింది. దీంతో రాజేశ్​ అరచేతి మొత్తాన్ని తొలగించాల్సి వచ్చింది.బురద నీటిలో కనిపించే క్లోస్ట్రడియం పెర్ఫ్రింజెన్స్ అనే బ్యాక్టీరియ వల్ల ఈ గ్యాస్​ గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ వస్తుందని బేబీ మెమోరియాల్ ఆస్పత్రి వైద్యలు కృష్ణకుమార్ తెలిపారు.ఈ బ్యాక్టీరియా బాడీలోకి ప్రవేశించి కణాలను నాశనం చేస్తుందన్నారు. ఇన్ఫెక్షన్​ మెదడుకు వ్యాప్తిస్తే ప్రాణాలకే ప్రమాదమన్నారు. రాజేశ్​ అరచేతిని తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయిందని కృష్ణకుమార్ చెప్పారు. చేతి వేలి గాయం ద్వారా ఆ బ్యాక్టీరియా శరీరం లోపలికి ప్రవేశించి ఉండవచ్చని అంచనా వేశారు.

బురద నీటిలో కనిపించే ఈ ప్రమాదకరమైన క్లోస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్ బ్యాక్టీరియా చిన్న గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించగలదు. ఇది శరీరంలోని కణజాలాన్ని నాశనం చేయడంతో పాటు, రక్తం ద్వారా మెదడుకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది.చేపలు, నీటి జీవుల వల్ల గాయాలైనా తక్షణమే వైద్యుల సూచన తీసుకోవాలి.బురద నీటిలో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని గుర్తు పెట్టుకోవాలి.గాయం తేలికగా అనిపించినా, అది తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున త్వరగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.తప్పనిసరి పరిస్థితుల్లోనే చెరువులు, నీటి గుంటలు శుభ్రం చేయాలి.గాయమైన ప్రదేశాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలి.

#BacterialInfection #BeAware #FishBite #FishermanInjury #GasGangrene #HandAmputation #HandInjury #HealthAlert #Healthcare #InfectionPrevention #Kannur #Kerala #KeralaNews #MedicalEmergency #StaySafe Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.