📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Central: వారణాసి, తిరుపతితో సహా 11 ఎయిర్‌పోర్ట్‌లు ప్రైవేట్ పరమే?

Author Icon By Vanipushpa
Updated: February 11, 2026 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ప్రభుత్వం దేశీయ విమానయాన రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. సుమారు ఐదేళ్ల విరామం తర్వాత దేశంలోని మరో 11 కీలక విమానాశ్రయాలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సిద్ధమైంది. దీని ద్వారా ప్రభుత్వం సుమారు రూ. 6,000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం విమాన ప్రయాణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏయే విమానాశ్రయాలు ఈ జాబితాలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఒకటి లాభం.. ఒకటి నష్టం! కొత్తగా ‘బండ్లింగ్’ విధానం ఈసారి ప్రభుత్వం ఒక ఆసక్తికరమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనినే ‘బండ్లింగ్’ విధానం అంటున్నారు. అంటే ఎక్కువ లాభాలు వచ్చే పెద్ద ఎయిర్‌పోర్ట్‌ తో పాటు, తక్కువ ఆదాయం వచ్చే చిన్న ఎయిర్‌పోర్ట్‌ ను కలిపి ఒకే ప్యాకేజీగా విక్రయిస్తారు. దీనివల్ల చిన్న విమానాశ్రయాల్లో కూడా మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: German girl in India : భారతీయులపై జర్మనీ యువతి కామెంట్స్

Central: వారణాసి, తిరుపతితో సహా 11 ఎయిర్‌పోర్ట్‌లు ప్రైవేట్ పరమే?

ప్రస్తుతానికి ప్రభుత్వం మొదటి దశగా..

ఒక ఐదు ఎయిర్ పోర్ట్ ప్యాకేజీలను రెడీ చేసింది. అవేంటంటే.. వారణాసి – కుషీనగర్ – గయా అమృత్‌సర్ – కాంగ్రా భువనేశ్వర్ – హుబ్లీ రాయ్‌పూర్ – ఔరంగాబాద్ తిరుచిరాపల్లి – తిరుపతి మన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి విమానాశ్రయం కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. రంగంలోకి దిగ్గజ సంస్థలు ఈ విమానాశ్రయాలను దక్కించుకోవడానికి అదానీ గ్రూప్, జీఎంఆర్ (GMR) ఎయిర్‌ పోర్ట్స్ వంటి స్వదేశీ సంస్థలతో పాటు విన్సీ ఎయిర్‌ పోర్ట్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక్కో ప్రయాణికుడిపై ఏ సంస్థ అయితే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఇస్తామని ఆఫర్ చేస్తుందో.. ఆ సంస్థకే కాంట్రాక్ట్ దక్కుతుంది. ఈ ప్రక్రియ అంతా ఏప్రిల్ నాటికి పూర్తి కానుంది. విమానాశ్రయాల ప్రైవేటీకరణలో కొత్త మలుపు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బండ్లింగ్’ పద్ధతి ద్వారా చాలా లాభాలే ఉన్నాయి. ఎక్కువ ఆదాయం ఇచ్చే లాభదాయకమైన విమానాశ్రయాలను, తక్కువ ఆదాయం వచ్చే చిన్న విమానాశ్రయాలతో కలిపి గ్రూపులుగా మారుస్తారు. ఇలా చేయడం వల్ల పెద్ద ఎయిర్‌పోర్ట్‌ల ద్వారా వచ్చే లాభాలను చిన్న ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధికి (క్రాస్-సబ్సిడీ) ఉపయోగించవచ్చు. తద్వారా ఒంటరిగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించలేని చిన్న నగరాల విమానాశ్రయాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనిపై పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ అప్రైజల్ కమిటీ సమీక్ష చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Airport private sector Airport privatization India Civil Aviation Ministry Indian aviation news infrastructure development Telugu News online Telugu News Today Tirupati airport Varanasi airport

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.