📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

నేడు ఢిల్లీలో 101 మంది పంజాబీ రైతుల ర్యాలీ

Author Icon By sumalatha chinthakayala
Updated: December 14, 2024 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ఈరోజు మూడోసారి ఢిల్లీకి పంజాబీ రైతులు ర్యాలీ తీయ‌నున్నారు. శంభూ బోర్డ‌ర్ నుంచి 101 మంది రైతులు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మ‌రో వైపు హ‌ర్యానా ప్ర‌భుత్వం మొబైల్ ఇంట‌ర్నెట్‌, బ‌ల్క్ ఎస్ఎంఎస్ స‌ర్వీసుల‌ను స‌స్పెండ్ చేసింది. అంబాలాలోని 12 గ్రామాల్లో డిసెంబ‌ర్ 17వ తేదీ వ‌ర‌కు ఆ ఆంక్ష‌లు విధించారు. రైతులు ఢిల్లీకి మార్చింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కిసాన్ మ‌జ్దూర్ మోర్చా నేత స‌ర్వాన్ సింగ్ పందేర్ తెలిపారు.డిసెంబ‌ర్ 6, 8వ తేదీల్లో చేసిన ప్ర‌య‌త్నాల‌ను హ‌ర్యానా పోలీసులు అడ్డుకున్న విష‌యం తెలిసిందే.

శాంతియుతంగా చేప‌డుతున్న ధ‌ర్నాల‌కు ప్ర‌భుత్వ ఏజెన్సీలు అడ్డుకుంటున్నాయ‌ని రైతులు ఆరోపించారు. రైతుల‌కు వ్య‌తిరేకంగా ప‌బ్లిక్ సెంటిమెంట్‌ను డెవ‌ల‌ప్ చేసేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. సంఘ‌విద్రోహక శ‌క్తులు త‌మ ర్యాలీలోకి ప్ర‌వేశించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరిన‌ట్లు రైతులు పేర్కొన్నారు.

మ‌రో వైపు బీజేపీ ఎంపీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. సింఘూ, టిక్రి బోర్డ‌ర్ వ‌ద్ద దాదాపు 700 మంది అమ్మాయిలు అదృశ్య‌మైన‌ట్లు ఆరోపించారు. 2020-2021లో నిర‌స‌న చేప‌ట్టిన స‌మ‌యంలో.. ఆ అమ్మాయిలు క‌నిపించ‌కుండాపోయార‌ని ఎంపీ రామ్‌చంద‌ర్ జంగ్రా తెలిపారు. బాధ్య‌తార‌హిత‌మైన వ్యాఖ్య‌లు చేసిన జంగ్రాను అరెస్టు చేయాల‌ని రైతు సంఘాల నాయ‌కుడు డిమాండ్ చేశారు.

Delhi March farmer leaders Punjab farmers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.