📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

కర్ణాటకలో మరో ఘోర ప్రమాదం..10 మంది మృతి

Author Icon By Sudheer
Updated: January 22, 2025 • 10:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటకలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపూర్ తాలూకాలోని గుల్లాపుర ఘట్ట జాతీయ రహదారిపై ఒక కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ట్రక్కు 50 మీటర్ల లోయలో పడటంతో ప్రమాద స్థాయి ఎక్కువైంది.


సావనూర్ నుంచి యల్లాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన మరో 10 మందిని వెంటనే హుబ్బళ్లి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతులు సవనూరు తాలూకాకు చెందినవారని, లారీలో మొత్తం 28 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

మృతులను ఫయాజ్ ఇమామ్ సాబ్ జమఖండి (45), వసీం వీరుల్లా ముదగేరి (35), ఇజాజ్ ముస్తాకా ముల్లా (20), సాదిక్ భాష్ ఫరాష్ (30), గులాముషేన్ జవలి (40), ఇంతియాజ్ మమజాపర్ ములకేరి (36), అల్పాజ్ జాఫర్‌లుగా గుర్తించారు. మందక్కి (25), జీలానీ అబ్దుల్ జఖాతి (25) అస్లాం బాబులీ బట్టర్ (24)గా గుర్తించారు.

అంతకు ముందు కూడా రాష్ట్రంలో మరో ప్రమాదం ఈరోజు ఉదయం జరుగగా..ఈ ప్రమాదంలో ఐదు మందిపైన చనిపోయారు. ప్రమాదంలో మృతిచెందిన వారింతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకున్నారు. పునరావృతమైన ప్రమాదాల నేపథ్యంలో రోడ్డు సంబంధిత చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు మరియు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి పలు చర్యలు తీసుకోవాలని ప్రజలు, అధికారుల వంతు నుండి గట్టి విజ్ఞప్తులు వ్యక్తం అవుతున్నాయి.

10 killed major accident Uttara Kannada district vegetable and fruit laden truck

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.