📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

సూపర్ స్టార్ దర్శన్ కు బెయిల్

Author Icon By Vanipushpa
Updated: December 13, 2024 • 4:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ కన్నడ నటుడు, శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీపకు ఊరట లభించింది. రేణుక స్వామి హత్యకేసులో అరెస్టయిన ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే కర్ణాటక హైకోర్ట్ ఆయనకు ఈ బెయిల్‌ను ఇచ్చింది.
అలాగే- ఇదే కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ నటి పవిత్ర గౌడ, మరో 15 మంది నిందితులకూ షరతులతో కూడిన బెయిల్ లభించింది. ప్రస్తుతం దర్శన్ తాత్కాలిక బెయిల్‌పై ఉన్నారు. బళ్లారి సెంట్రల్ జైలులో అనారోగ్యానికి గురైన నేపథ్యంలో న్యాయస్థానం ఆయనకు ఆరు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది.
ఈ కేసు జాతీయ స్థాయిలోనే త్రీవ సంచలనంగా మారినవిషయం తెలిసేందే.
తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దర్శన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎస్ విశ్వజిత్ షెట్టి సారథ్యంలోని బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది. దర్శన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సీవీ నగేష్ వాదించారు. వాదోపవాదాలను ఆలకించిన తరువాత తీర్పును డిసెంబర్ 9వ తేదీన రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. తాజాగా దాన్ని వెల్లడించారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌.. ప్రధాన నిందితుడు. కన్నడ నటి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీలకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తుండేవాడనే కారణంతో రేణుకా స్వామిపై కక్ష పెంచుకుని సుపారీ ఇచ్చి అతణ్ని హత్య చేయించాడనే ఆరోపణలపై ఈ ఏడాది జూన్ 11వ తేదీన అరెస్ట్ అయ్యారు. దర్శన్, పవిత్ర గౌడ, మరో 15 మంది పేర్లపై పోలీసులు ఛార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 3,991 పేజీల ఛార్జ్‌షీట్ ఇది. ఇందులో ఏ1గా పవిత్ర గౌడ, ఏ2గా దర్శన్‌‌ పేర్లను నమోదు చేశారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం ఈ ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు అందజేసింది.

BAIL Darshan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.