📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

విడాకుల కోసం ఐదు కోట్లు చెల్లించాలని సుప్రీం ఆదేశం

Author Icon By Vanipushpa
Updated: December 12, 2024 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ, డిసెంబర్ 12,
వారిద్దరూ భార్యాభర్తలు. అయితే రెండు దశాబ్దాలుగు వారు చేస్తున్న పోరాటంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చేసింది. ఈ కేసుకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భార్యాభర్తల విడాకుల కేసులో వివాహాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు భార్యకు శాశ్వత భరణంగా రూ. 5 కోట్లు ఏకమొత్తంగా చెల్లించాలని భర్తను ఆదేశించింది. అంతేకాక కుమారుడి పితృత్వ బాధ్యతలు నిర్వర్తించాల్సిన బాధ్యత తండ్రిపై ఉందని, కాబట్టి శాశ్వత భరణం కింద ఆ మొత్తం చెల్లించాల్సిందేనని జస్టిస్ విక్రం నాథ్, జస్టిస్ ప్రసన్న వి.వరాలేతో కూడిన ధర్మాసనం నొక్కి చెప్పింది. అలాగే, యువకుడైన కుమారుడి ఆర్థిక భద్రత, పోషణ కోసం కోటి రూపాయలు కేటాయించాలని ఆదేశించింది.

ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ భార్యాభర్తలు. వీరు విడాకుల కోసం కోర్టును ఆశ్రయంచారు. ఈ కేసులో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. వీరు రెండు దశాబ్దాలుగా వేర్వేరుగా ఉంటున్నారు. అంజుది అతి సున్నితత్వమని, తమ కుటుంబంలో ఆమె ఇమడలేదని ప్రవీణ్.. ప్రవీణ్ తనను సరిగా చూసుకోవడం లేదని అంజు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వైవాహిక బంధం నుంచి దూరం జరిగారు. ఈ నేపథ్యంలో వారికి కొన్ని ప్రత్యేకమైన షరతులతో తాజాగా అత్యున్నత న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.
ఇటీవల కాలంలో దేశంలో విడాకులు శాతం పెరిగిపోతున్నది. తరచుగా కోర్టులు కూడా విచారం వ్వక్తం చేస్తున్నాయి. దంపతుల మధ్య ప్రేమ కొరవడడం బాధాకరం.
ఇద్దరూ దీర్ఘకాలంగా విడిగా ఉంటున్న నేపథ్యంలో తమ వైవాహిక బాధ్యతలను నిర్వర్తించే అవకాశం లేదని, వారి మధ్య బంధం కోలుకోలేని విధంగా తెగిపోయిన నేపథ్యంలో ఈ తీర్పు వెల్లడించింది. దంపతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తులో భార్యాపిల్లల ప్రాథమిక అవసరాలు, ఇరు పక్షాల సామర్థ్యాలు, ఉద్యోగావకాశాలు, వారి ఆదాయ వనరులు, ఆస్తులు.. వంటి 8 కీలక అంశాలను దృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

#divorce Supreme Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.