हिन्दी | Epaper

రోడ్డు ప్రమాదాలతో గంటకు ఎంత మంది చనిపోతున్నారో తెలుసా..?

Sudheer
రోడ్డు ప్రమాదాలతో గంటకు ఎంత మంది చనిపోతున్నారో తెలుసా..?

దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.72 లక్షల మంది చనిపోయారని తెలిపింది. సగటున గంటకు 20 మంది చనిపోయారు. 4.62 లక్షల మంది గాయపడ్డారు. 2022తో పోల్చుకుంటే మృతులు, గాయాలపాలైన వారి సంఖ్య పెరిగింది. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ లో 23,652 మృతి, తమిళనాడులో 18,347 మృతి , మహారాష్ట్ర లో 15,366 మంది చనిపోయారు. అటు అత్యధికంగా తమిళనాడు లో 67,213 ప్రమాదాలు జరిగినట్లు నివేదికలో పేర్కొంది.

ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ రహదారులు మృత్యు మార్గాలుగా మారాయని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలో సగటున గంటకు 55 చొప్పున వాహనాలు ఢీ కొంటున్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో జరుగుతున్న ప్రమాదాల విషయానికి వస్తే ఢిల్లీలో అత్యధికంగా 1,457 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక, దేశంలో రోజుకు 26 మంది చిన్నారులు ప్రమాదాల్లో జీవితాలను కోల్పోతున్నారు. గత ఏడాది 9,489 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో పురుషులే ఎక్కువగా ఉంటున్నారని నివేదిక వెల్లడించింది. రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో గ్రామీణులు 68.4 శాతం మంది ఉండగా, పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 31.5 శాతం మంది ఉన్నట్లు స్పష్టం చేసింది.

ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు .. అతివేగం , డ్రైవింగ్ లో ఫోన్ ఉపయోగించడం, త్రాగి డ్రైవ్ చేయడం వంటి తప్పిదాలు ప్రమాదాలకు కారణమవుతాయి. అలాగే గుంతల రోడ్లు వల్ల, బ్రేకులు, టైర్లు, లైట్లు వంటి వంటివి సరిగా పని చేయకపోవడం వల్ల, ట్రాఫిక్ లైట్లను గౌరవించకపోవడం, యూటర్న్ వద్ద జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870