📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు..కాంగ్రెస్‌కు ఈసీ ఆహ్వానం

Author Icon By Sudheer
Updated: November 30, 2024 • 7:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున విషయం తెలిసిందే. ఈక్రమంలోనే కాంగ్రెస్‌ రాసిన లేఖకు ఎన్నికల సంఘం స్పందించింది. అనుమానాల నివృత్తి కోసం డిసెంబర్ 3న రావాలని కాంగ్రెస్‌ ప్రతినిధి బృందాన్ని ఎలక్షన్ కమిషన్​ (ఈసీ) ఆహ్వానించింది. ఎన్నికలు ప్రతిదశలోనూ పారదర్శకంగా జరిగాయని తెలిపింది. చట్టపరమైన ఆందోళనలను, అనుమానాలను పరిశీలించనున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం అనుమానాలు విన్న తర్వాత రాతపూర్వక సమాధానం ఇస్తాం అంటూ కాంగ్రెస్​ పార్టీ బృందాన్ని ఈసీ ఆహ్వానించింది.

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సహా అగ్ర నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఈసీకి లేఖ రాశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారంటూ పోలింగ్‌ డేటాలోనూ తేడాలున్నాయని లేఖలో ప్రస్తావించారు. వ్యక్తిగతంగా హాజరై తమ అనుమానాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్‌ రాసిన లేఖపై ఈసీ తాజాగా స్పందించింది.

ఇటీవలే వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విపక్ష మహా వికాస్‌ అఘాడీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. కూటమిలోని బీజేపీకి 132, షిండే సేనకు 57, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. విపక్ష కూటమిలోని కాంగ్రెస్‌కు 16, శివసేన (యూబీటీ) 20, ఎన్సీపీ (ఎస్‌పీ) 10 స్థానాల్లో మాత్రమే గెలుపొందాయి.

congress EC maharashtra elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.