📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

నేడు కేజ్రీవాల్‌ నామినేషన్‌

Author Icon By sumalatha chinthakayala
Updated: January 15, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ ఈరోజు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అయితే నామినేషన్‌ దాఖలుకు ముందు కన్నౌట్‌ ప్రాంతంలోని హనుమాన్‌ ఆలయాన్ని కేజ్రీవాల్‌ సందర్శించారు. భార్య సునీతతో కలిసి ఆలయానికి చేరుకున్న కేజ్రీవాల్‌ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రిటర్నింగ్‌ ఆఫీస్‌కు వరకూ ర్యాలీగా బయల్దేరనున్నారు. అక్కడ నామినేషన్‌ దాఖలు చేస్తారు. కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.

కాగా, ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. మద్యం పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై విచారణ చేపట్టేందుకు ఈడీకి కేంద్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, తర్వాత కేంద్ర హోం శాఖ నుంచి అనుమతి పొందింది ఈడీ. దీంతో కేజ్రీవాల్‌ను వివాదాస్పద మద్యం పాలసీపై విచారించేందుకు ఈడీకి ఉన్న అడ్డంకులు తొలగిపోయనట్లయింది. అలాగే ఆప్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈడీ త్వరలోనే విచారించే అవకాశముంది.

image

ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమ నగదు చలామణీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ గతేడాది మార్చి 21న అప్పటి సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. తర్వాత సీబీఐ కూడా కేసు నమోదు చేసి గతేడాది జూన్‌లో అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో ఆప్ ముఖ్యనేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కవిత అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరంతా బెయిలుపై విడుదలయ్యారు.

గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడంతో బయటకొచ్చిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసి పూర్తి పార్టీ కార్యకలాపాలపైనే దృష్టి పెట్టారు. ఎలాగైనా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. మరో మూడు వారాల్లో పోలింగ్ జరగనుండగా.. ఈ తరుణంలో మద్యం కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఉచ్చు బిగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ 70 శాసనసభ సీట్లకు గాను ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

Arvind Kejriwal Delhi Assembly Elections Hanuman Mandir nomination today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.