📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

డిసెంబర్ 5న కొలువుదీరనున్న మహారాష్ట్ర సర్కారు..?

Author Icon By Sudheer
Updated: November 30, 2024 • 5:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 218 సీట్లతో ‘మహాయుతి’ కూటమి అఖండ విజయం ఖాయమైంది. దీంతో ఓవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఈసారి ఎవరిని వరించబోతోందనే చర్చ జరుగుతుండగా, మరోవైపు కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఎప్పుడనే అంశం కూడా తెరపైకి వచ్చింది.

మహారాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 5న కొలువు దీరుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. సౌత్ ముంబైలోని ఆజాద్ మైదానంలో ‘మహాయుతి’ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుందని తెలిపాయి. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం డిసెంబర్ 2 లేదా 3వ తేదీన ఉంటుందని, అప్పుడే ఆ పార్టీ LP నేతను ఎన్నుకుంటుందని చెప్పాయి. అటు శిండే స్వగ్రామంలో ఉండగా, ఫడణవీస్ సీఎం పీఠం విషయంలో ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. ఈ క్రమంలో సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది.

అధికారికంగా సీఎం ఎవరనేది ప్రకటించనప్పటికీ మరో నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రితో సహా కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్ 2వ తేదీన అతిపెద్ద ఈవెంట్‌గా ఈ ప్రమాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. సీఎం పదవే ప్రధాన అంశంగా ఉండటంతో కూటమి నేతలతో చర్చోపచర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండేనే కొనసాగించాలని షిండే శివసేన నేతల నినాదంగా ఉండగా, అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గం నేతలు తమ నేతకు సీఎం పట్టం కట్టాలంటూ పోస్టర్లు కూడా వేస్తున్నారు. మరోవైపు, బీజేపీ ప్రచారసారథిగా అత్యధిక ర్యాలీలు నిర్వహించి ఆ పార్టీకి అత్యధిక సీట్లు సాధించిపెట్టడంతో పాటు, కూటమి నేతల విజయానికి కృషి చేసిన దేవేంద్ర ఫడ్నవిస్‌కు సీఎం పదవి ఇచ్చితీరాలని బీజేపీ నేతలు బలమైన వాదన వినిపిస్తున్నారు. కాబోయే సీఎం ఫడ్నవిస్ అంటూ పోస్టర్లు కూడా వెలిసాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి రేసులో దేవేంద్ర ఫడ్నవిస్ ముందు స్థానంలో నిలుస్తున్నారు.

maharashtra new cm The government of Maharashtra

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.