📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

జమిలి బిల్లుపై జేపీసీ బాధ్యతలు ఏమిటి?

Author Icon By Vanipushpa
Updated: December 18, 2024 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ వ్యాపితంగా ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన జమిలి బిల్ ను జేపీసీకి పంపిన విషయం తెలిసేందే. నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్ ఎన్నికల నిర్వహణ బిల్లుల విస్తృత పరిశీలన కోసం ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’కి (జేపీసీ) పంపుతూ లోక్‌సభ నిర్ణయించింది. పార్లమెంట్, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన ఈ ప్రతిపాదిత ‘129 సవరణ చట్టం-బిల్లు’, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ బిల్లుల విస్తృత పరిశీలన కోసం ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’కి (జేపీసీ) పంపుతూ లోక్‌సభ నిర్ణయించింది. అయితే, జేపీసీని ఎలా ఏర్పాటు చేస్తారు? ఈ కమిటీ ఏం చేస్తుంది? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
ఎంపీల సంఖ్య ఆధారంగా..
పార్లమెంట్‌లో ఉన్న ఎంపీల సంఖ్య ఆధారంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన చట్టసభ్యులను కమిటీలోకి తీసుకుంటారు. రాజ్యసభ సభ్యులు కూడా కమిటీలో ఉంటారు. అత్యధిక సంఖ్యలో ఎంపీలను కలిగివున్న పార్టీకి కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రస్తుతం ఆ అవకాశం బీజేపీకి దక్కనుంది.
కమిటీ కాల వ్యవధి 90 రోజులు
జేపీసీలో గరిష్ఠంగా 31 మంది సభ్యులు ఉండవచ్చు. ఈ కమిటీ కాల వ్యవధి 90 రోజులుగా ఉంటుంది. అవసరమైతే ఆ తర్వాత గడువును పొడిగించేందుకు అవకాశం ఉంటుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మరో 48 గంటల్లోనే జేపీసీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే శుక్రవారంతో (డిసెంబర్ 20) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిపోనున్నాయి.
జేపీసీ బాధ్యతలు
కమిటీలో భాగంగా లేని ఎంపీలు, మాజీ జడ్జిలు, లాయర్లు వంటి ఇతర న్యాయ, రాజ్యాంగ నిపుణులతో పాటు సంబంధిత భాగస్వాములతో జేపీసీ సభ్యులు ‘విస్తృత సంప్రదింపులు’ జరుపుతారు. ఈ సమాచారాన్ని సేకరించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలన చేసి క్లాజులవారీగా లోక్‌సభకు నివేదికను సమర్పించనుంది. మూడవసారి బీజేపీ గెలవడంతో జమిలిపై పట్టుదలతో వుంది.

jamili JCP parliment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.