📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

అమిత్ షాపై లాలు ప్రసాద్ ఫైర్

Author Icon By Vanipushpa
Updated: December 19, 2024 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పిచ్చెక్కిందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై నిన్న రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ లాలు ఇలా విరుచుకుపడ్డారు. ‘అమిత్ షాకు పిచ్చెక్కింది. రాజకీయాలు వదిలేయాలి. వెంటనే రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.

దేవుడిని స్మరిస్తే చాలు
రాజ్యాంగంపై చర్చలో భాగంగా నిన్న రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ మాటిమాటికి ‘అంబేద్కర్’ అనడం కాంగ్రెస్‌కు ఫ్యాషన్ అయిపోయిందన్నారు. .. అంబేద్కర్ అనడం మానేసి అన్నిసార్లు దేవుడిని స్మరిస్తే కనీసం స్వర్గానికైనా వెళ్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎవరి స్థానం వారిదేనని తాము అంబేద్కర్ ను దేవుడిగా భావించడం లేదని, అంబేద్కర్ మన దేశానికీ యెనలేని సేవలను బీజేపీ మర్చిపోవడం సరియేనది కాదని కాంగ్రెస్ పేర్కొంది. అమిత్ షా గర్వం తలకెక్కి మాట్లాడుతున్నారని వారు అన్నారు.

క్షమాపణలు చెప్పాలి
బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ కూడా అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకశక్తిగా మారుతోందని ఆరోపించారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగోర్ నేడు లోక్ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. షా పార్లమెంటులోనే అంబేద్కర్‌ను అవమానించారని, కాబట్టి ఆయన క్షమాపణలు చెప్పడంతోపాటు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు మాణికం ఠాగోర్ పేర్కొన్నారు.

ambedkar amith sha lalu prasad yadav

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.