📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్

Author Icon By Vanipushpa
Updated: January 1, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంబంధమైన పనులకు చేసిన కొన్ని మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

జీఎస్టీలో కీలక మార్పులు
జీఎస్టీ పోర్టల్‌లో మెరుగైన భద్రత కోసం పన్ను చెల్లింపుదారులు జనవరి 1 నుంచి మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను పాటించడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.

మరోవైపు, 180 రోజుల కంటే పాత బేస్ డాక్యుమెంట్లకు ఈ-వే బిల్లులు (ఈడబ్ల్యూ‌బీలు) జనరేట్ కావు.
ఫీచర్ ఫోన్లలో యూపీఐ పేమెంట్స్ పరిమితి పెంపు ‘యూపీఐ 123పే’ ద్వారా ఫీచర్ ఫోన్లలో పేమెంట్లు చేస్తున్నవారు ఇవాళ్టి నుంచి రోజుకు గరిష్ఠంగా రూ.10,000 వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా మునుపటి రూ.5,000 పరిమితిని ఆర్బీఐ పెంచింది.


ఈపీఎఫ్‌వో కొత్త రూల్
కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థలో (సీపీపీఎస్) భాగంగా పెన్షన్ ఉపసంహరణను ఈపీఎఫ్‌వో క్రమబద్ధీకరించిది. దీంతో, పెన్షన్ ఉపసంహరణ మరింత సులభంగా మారింది. పెన్షనర్లు ఇకపై దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్‌ను ఉపసంహరించుకోవచ్చు. అదనపు ధ్రువీకరణ ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయి. మరోవైపు, ఈపీఎఫ్‌వో త్వరలోనే ఏటీఎం కార్డులను జారీ చేయనుంది.

అంతేకాదు, ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ పరిమితిని కూడా ప్రభుత్వం ఈ ఏడాది తొలగించే అవకాశాలు ఉన్నాయి.దేశంలోని రైతులు ఇకపై రూ.2 లక్షల వరకు హామీలేని బ్యాంక్ రుణాన్ని పొందవచ్చు. ఈ మేరకు మునుపటి రూ.1.60 లక్షల పరిమితిని ఆర్బీఐ పెంచింది.

హెచ్-1బీ వీసాలో మార్పులు
ఇవాళ్టి నుంచి భారతదేశంలోని నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు తమ వీసా అపాయింట్‌మెంట్‌ను ఉచిత రీషెడ్యూల్‌ చేసుకోవచ్చు. అయితే, రెండవసారి రీషెడ్యూల్ చేయాలనుకుంటే కొత్త దరఖాస్తుతో పాటు వీసా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది.

అపాయింట్‌మెంట్ షెడ్యూలింగ్‌ ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. మరోవైపు, జనవరి 17 నుంచి హెచ్-1 వీసా ప్రక్రియ అప్‌డేట్ కానుంది.

changes new financial rules

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.