📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

అతుల్ ఆత్మహత్య కేసులో పరారీలో భార్య

Author Icon By Vanipushpa
Updated: December 13, 2024 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య పరారీలో ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ (34) ఆత్మహత్య కేసులో పోలీసులు రంగంలోకి దిగారు. భార్య, అత్తింటి వారి చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అతుల్ రాసిన 40 పేజీల సూసైడ్ నోట్, 90 నిమిషాల వీడియో రికార్డింగ్ సంచలనమైంది. ఆత్మహత్య నోట్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టుకు పంపించాడు. వేధింపులకు గురవుతున్న భర్తలను కాపాడాలని అందులో అతుల్ వేడుకున్నాడు. తన భార్య, అత్తింటి వారితోపాటు తన ఆత్మహత్యతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేయాలని కోరాడు. విడాకుల సెటిల్‌మెంట్ కోసం రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అందులో సుభాష్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా రంగంలోకి దిగిన కర్ణాటక పోలీసులు అతుల్ అత్త నిషా సింఘానియా, ఆయన బావమరిది అనురాగ్ సింఘానియాను గత రాత్రి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అతుల్ భార్య నికిత సింఘానియా కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని జౌన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నించారు. అనంతరం కోర్టు అనుమతితో వారిని శుక్రవారం బెంగళూరుకు తరలిస్తున్నారు. తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టుఅతుల్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, సెక్షన్ 498ఏపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతున్నట్టు చెబుతూ విచారం వ్యక్తం చేసింది. భరణం విషయంలో 8 అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా చూడాలని కోర్ట్ పేర్కొనింది.

#athul subhah bengaluru wife

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.