Narendra Modi: ప్రధాని మోదీకి ఘనా అత్యున్నత జాతీయ పురస్కారం

Read Time:  1 min
Narendra Modi: ప్రధాని మోదీకి ఘనా అత్యున్నత జాతీయ పురస్కారం
FONT SIZE
GET APP

భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తన ఐదు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా పశ్చిమ ఆఫ్రికా (West Africa) దేశం ఘనా చేరుకొని, అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఘనా రాజధాని అక్రాలో బుధవారం జరిగిన అద్భుత కార్యక్రమంలో ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం అయిన “ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా (Officer of the Order of the Star of Ghana)” అవార్డును ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామ స్వయంగా అందజేశారు.

Narendra Modi
Narendra Modi

ప్రపంచ నాయకత్వానికి గుర్తింపు

ఈ గౌరవం ప్రధాని మోదీకి ప్రపంచ స్థాయిలో ఉన్న నాయకత్వ ప్రతిభ, విజన్, మరియు రాజకీయ స్థిరత్వానికి గుర్తింపుగా భావించవచ్చు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు వాణిని సమర్థంగా వినిపిస్తూ, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను అంతర్జాతీయ వేదికలపై ఉద్దేశపూర్వకంగా ముందుకు తీసుకెళ్తున్న మోదీకి ఇది న్యాయమైన గౌరవం.

ప్రధాని స్పందన

ఈ అవార్డు పట్ల ప్రధాని మోదీ (Narendra Modi) స్పందిస్తూ – ఈ పురస్కారాన్ని తాను 140 కోట్ల మంది భారతీయుల తరఫున స్వీకరిస్తున్నానని తెలిపారు. భారత యువత ఆకాంక్షలకు, దేశ సాంస్కృతిక వైవిధ్యానికి, అలాగే భారత్-ఘనా మధ్య ఉన్న చారిత్రక బంధానికి ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రత్యేక గౌరవం అందించినందుకు ఘనా ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. “ఘనా అత్యున్నత పురస్కారం (Ghana’s highest award) అందుకోవడం గౌరవంగా ఉంది. ఇది భారత్-ఘనా మధ్య ఉన్న బలమైన, చిరకాల సంబంధాలకు నిదర్శనం” అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

విదేశాంగ శాఖ స్పందన

ప్రధాని మోదీకి ఈ పురస్కారం లభించడంపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. గ్లోబల్ సౌత్ దేశాల వాణిని బలోపేతం చేయడానికి మోదీ చేస్తున్న నిరంతర కృషికి లభించిన గుర్తింపు ఇద‌ని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఘనాతో మన స్నేహానికి, సహకారానికి ఇది నిదర్శనమని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని, ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు తనపై కొత్త బాధ్యతను పెంచిందని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు విదేశాంగ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

మొదటి సందర్శన – చారిత్రక స్థాయికి సంబంధించిన పర్యటన

ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మొదటగా ఘనా చేరుకున్నారు. గత మూడు దశాబ్దాల కాలంలో ఒక భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, ఘనా అధ్యక్షుడు మహామ మధ్య విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. అనంతరం ఇరు దేశాలు తమ సంబంధాలను ‘సమగ్ర భాగస్వామ్య’ స్థాయికి పెంచుకుంటున్నట్లు ప్రకటించాయి. తన చారిత్రక పర్యటన భారత్-ఘనా సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

Read also: Kidnap: మాలిలో భారతీయుల కిడ్నాప్‌ కలకలం

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.