తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంట్రాక్టర్ల వద్ద నుంచి కమిషన్లు తీసుకుంటూ ఇరిగేషన్ అధికారులు (Irrigation officials), పనులు మాత్రం పూర్తిచేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో నూతనంగా చేపట్టిన పనులు ఎందుకు పూర్తికాలేదని అధికారులను ప్రశ్నించారు.
ఇర్కోడ్ లిఫ్ట్ ప్రాజెక్ట్ పై ప్రశ్నల వర్షం
ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. “ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు 2022లో శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటివరకు ఒక్క లీటర్ నీళ్లను కూడా రైతులకు అందించలేకపోయారు. నిధులు కేటాయించకుండా, పనులను పూర్తి చేయకుండానే కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ఎలా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మేలు చేయాల్సిన ప్రాజెక్టు రాజకీయ లాభాల కోసం వాయిదా పడుతుందన్న ఆరోపణ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన ఎంపీ
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలు పూర్తవుతున్నా, ఇరిగేషన్ శాఖపై సరైన సమీక్ష జరగలేదని ఎంపీ రఘునందన్ మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో కమీషన్లు తీసుకోవడం తప్ప, రైతులకు మేలు చేసే పనులు చేయడంలేదని విమర్శించారు. సాగునీటి పనులపై తక్షణమే సమీక్ష నిర్వహించి, ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Read Also : Kishan Reddy: కేంద్ర రైల్వే శాఖ మంత్రితో కిషన్రెడ్డి సమావేశం