ఆ నిందితుడికి మరణశిక్ష పడేలా చూడండి: సీఎం చంద్రబాబు

Read Time:  1 min
Shocked by girls death in
Shocked by girls death in
FONT SIZE
GET APP

బద్వేల్‌లో జరిగిన దారుణ ఘటనలో యువతి మరణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒక భవిష్యత్తు ఉన్న విద్యార్థి, దుర్మార్గుడి దుశ్చర్యకు బలవడడం ఆయనను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

చంద్రబాబు, ఈ ఘటనపై స్పందిస్తూ, “విచారణ త్వరగా పూర్తిచేసి, నిందితుడికి మరణశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి” అని అధికారులను ఆదేశించారు. మహిళలపై అఘాయిత్యాలు చేసేవారికి ఇది ఒక హెచ్చరికగా ఉండాలని, ఈ కేసును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ పూర్తి చేసి, తగిన శిక్ష విధించాలన్నారు.

మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.