కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ (Kantara – Chapter 1)చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 1న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షో నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జీవో విడుదల చేసింది. సాధారణంగా సినిమాల ప్రీమియర్ షోలకు రాత్రి 9 తర్వాత అనుమతులు ఇవ్వడం అరుదుగా జరుగుతుంది. ఈ చిత్రానికి భారీ అంచనాలు ఉండటంతో, రిషబ్ శెట్టి అభిమానుల డిమాండ్ దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది.
News telugu: Chiranjeevi-కుటుంబ సభ్యులతో కలిసి ఓజీ సినిమా చూసిన చిరంజీవి
ఏపీ ప్రభుత్వం (AP Govt) ‘కాంతార ఛాప్టర్-1’కు టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరకు అదనంగా Rs.75+GST, మల్టీప్లెక్స్లలో Rs.100+GST అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పెరిగిన రేట్లు అక్టోబర్ 11 వరకు అమల్లో ఉంటాయి. ఈ నిర్ణయంతో ప్రీమియర్ షో, తొలి వారంలో ప్రదర్శనలు మరింత భిన్నంగా, భారీ స్థాయిలో జరుగనున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్కు అభిమానుల నుండి విపరీతమైన స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ‘కాంతార’ మొదటి భాగం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో, రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ప్రీమియర్ అనుమతులు, టికెట్ రేట్ల పెంపు వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఆర్థికంగా ఊరట లభించనుంది. దీంతో ‘కాంతార ఛాప్టర్-1’ ఏపీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.