📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Kingdom : ఏపీలో ‘కింగ్డమ్’ సినిమా టికెట్ రేట్లు పెంపు

Author Icon By Sudheer
Updated: July 24, 2025 • 3:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom ) జూలై 31న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ‘హృదయం లోపల’, ‘అన్న అంటేనే’ పాటలకు మంచి స్పందన రావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకోనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ‘కింగ్‌డమ్’ సినిమా టికెట్ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చింది.

సింగిల్స్, మల్టీప్లెక్స్‌లలో ప్రత్యేక టికెట్ రేట్లు

ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో ప్రకారం, ‘కింగ్‌డమ్’ సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజులపాటు టికెట్ రేట్ల పెంపు వర్తించనుంది. సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 అదనంగా చార్జ్ చేయడానికి అనుమతినిచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాగ వంశీ నిర్మించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. టికెట్ రేట్ల పెంపుతో పాటు, సినిమా రిలీజ్ ముందు అభిమానుల కోసం భారీ ప్రమోషన్లు కూడా ప్లాన్ చేస్తున్నారు.

తిరుపతిలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్

చిత్రబృందం ప్రకారం, జూలై 26న తిరుపతిలో ‘కింగ్‌డమ్’ ట్రైలర్‌ను భారీ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. అభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్న అవకాశం ఉంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మితమైన ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం జోమోన్ టి.జాన్ మరియు గిరీష్ గంగాధరన్ నిర్వహించగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు వహించారు.

Read Also : Himachal Pradesh Floods : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు 77 మంది మృతి

Ap Google News in Telugu kingdom vijay devarakonda

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.