టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సృష్టించిన ‘యానిమల్’ మేనియా అంతా ఇంతా కాదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డుల తర్వాత, దీని సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుపై హీరో రణబీర్ కపూర్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్తో ‘స్పిరిట్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నందున, ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే యానిమల్ పార్క్ సెట్స్పైకి వెళ్లనుంది.
FTA: భారత్- ఈయూ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం
యానిమల్ పార్క్ గురించి రణబీర్ పంచుకున్న మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ కథను కేవలం ఒక సీక్వెల్తో ముగించకుండా మూడు భాగాలుగా (3 Parts) ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొదటి భాగంలో తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఎమోషన్స్ మరియు హింసను చూపించిన సందీప్, రెండో భాగంలో అంతకు మించిన డార్క్ యాక్షన్ను సిద్ధం చేస్తున్నారట. ముఖ్యంగా సీక్వెల్లో రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయం (Dual Role) చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి పార్ట్ చివరలో కనిపించిన రణబీర్ లాంటి విలన్ క్యారెక్టర్ ‘అజీజ్’ మరియు ఒరిజినల్ క్యారెక్టర్ ‘రణవిజయ్’ మధ్య జరిగే పోరు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది.
ఈ సీక్వెల్ మొదటి భాగం కంటే మరింత లోతుగా, క్యారెక్టర్ల మానసిక సంఘర్షణను ప్రతిబింబించేలా ఉంటుందని రణబీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సందీప్ రెడ్డి వంగా మార్క్ రా ఇంటెన్సిటీతో పాటు, మరింత వైల్డ్ అండ్ వైలెంట్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లు సంకేతాలిచ్చారు. 2027లో షూటింగ్ మొదలైనప్పటికీ, ప్రీ-ప్రొడక్షన్ పనులు మరియు స్క్రిప్ట్ డెవలప్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయని సమాచారం. యానిమల్ మూవీతో బాలీవుడ్ స్టార్డమ్ను కొత్త శిఖరాలకు చేర్చుకున్న రణబీర్, ‘యానిమల్ పార్క్’తో ఇండియన్ సినిమా చరిత్రలో మరిన్ని మైలురాళ్లు సృష్టిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.