Suniel Shetty comments : బాలీవుడ్ సీనియర్ నటుడు Suniel Shetty తన కుమారుడు Ahan Shetty నటించిన Border 2 చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తర్వాత మాత్రమే తాను చూస్తానని ఒక ప్రత్యేక మొక్కు పెట్టుకున్నట్లు తెలిపారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆ మైలురాయిని చేరాలని తండ్రిగా తన కోరిక అని చెప్పారు.
జనవరి 23న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే భారీ విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇటీవల జరిగిన Ideas of India Summit 2026 కార్యక్రమంలో మాట్లాడుతూ, “సినిమా విడుదలకు ముందే ఇది ₹500 కోట్ల క్లబ్లో చేరాలని కోరుకున్నాను. ఆ మార్క్ దాటిన తర్వాతే చూస్తానని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం సినిమా ₹489 కోట్ల వద్ద ఉంది. మరో ₹10–11 కోట్లు దేవుడు ఒక తండ్రి ప్రేమ కోసం ఇస్తాడని ఆశిస్తున్నాను” అని భావోద్వేగంగా తెలిపారు.
Read Also: Manchu Vishnu Dubai: దుబాయ్లో మంచు విష్ణు ఫ్యామిలీకి తప్పిన ముప్పు

Sunny Deol, Varun Dhawan, Diljit Dosanjh మరియు అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, 1997లో విడుదలైన క్లాసిక్ దేశభక్తి చిత్రం Border కు సీక్వెల్గా తెరకెక్కింది. తొలి భాగంలో సునీల్ శెట్టి కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. తన మొక్కు కారణంగా సినిమా ప్రీమియర్కు హాజరైనా, థియేటర్ లోపలికి వెళ్లకుండా బయటే నిలిచిపోయానని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ₹500 కోట్ల లక్ష్యానికి చేరువలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ఆ మైలురాయిని దాటుతుందని సునీల్ శెట్టి ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: