దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సాయిపల్లవి, తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం పదేళ్ల సినీ ప్రయాణంలో, మూడు విభిన్న భాషల్లో (తెలుగు, తమిళం, మలయాళం) ఏకంగా ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకుని సౌత్ ఇండియాలోనే రికార్డు సృష్టించారు. 2015లో మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో సినీ రంగప్రవేశం చేసిన ఆమె, ఆ సినిమాకే ‘బెస్ట్ యాక్ట్రెస్ డెబ్యూ’ అవార్డును అందుకుని తన ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించారు. అప్పటి నుండి గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ, ప్రేక్షకుల గుండెల్లో ‘లేడీ పవర్ స్టార్’గా స్థానం సంపాదించుకున్నారు.
Hyderabad-Goa Greenfield Highway : హైదరాబాద్-గోవా గ్రీన్ఫీల్డ్ హైవేపై కీలక అప్డేట్
తెలుగులో సాయిపల్లవి ప్రభంజనం అంతా ఇంతా కాదు. ‘ఫిదా’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాల్లో తన సహజ సిద్ధమైన నటనతో ఉత్తమ నటిగా అవార్డులు కొల్లగొట్టారు. అలాగే ‘విరాటపర్వం’ సినిమాలో ఆమె ప్రదర్శించిన నటనకు ‘ఉత్తమ నటి (క్రిటిక్స్)’ పురస్కారం దక్కింది. తమిళంలో కూడా ‘గార్గి’, మరియు ఇటీవల విడుదలైన ‘అమరన్’ చిత్రాలకు గానూ ఉత్తమ నటి అవార్డులను సొంతం చేసుకున్నారు. కేవలం నటనతోనే కాకుండా, తనదైన డాన్స్ స్టెప్పులతో రికార్డులు సృష్టించే సాయిపల్లవి, ఇలా వరుసగా ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించడం ఆమె అంకితభావానికి నిదర్శనం. ప్రతిష్టాత్మక అవార్డుల వేదికలపై సాయిపల్లవి పేరు మారుమోగడం చూస్తుంటే, ఆమె భారతీయ సినిమా గర్వించదగ్గ నటిగా ఎదిగిందని చెప్పవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com