📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

వైరల్ అవుతున్న రష్మిక పోస్ట్

Author Icon By Sudheer
Updated: February 6, 2025 • 2:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్మిక మందన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి. అయితే, ఇటీవల ఆమె పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో “దయ ” చూపించండి అంటూ ఓ మెసేజ్ షేర్ చేయగా, ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. “ఈరోజుల్లో దయ తగ్గిపోతోంది, అందరూ ఒకరిపై ఒకరు దయతో ఉండాలి” అని చెప్పిన ఆమె, తన ధరించిన టీషర్ట్‌పై కూడా ‘Kindful’ అనే పదం ఉంది. దీంతో ఆమె పోస్ట్ వెనుకున్న అర్థం గురించి అభిమానులు, నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు.

ఇటీవల రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి జిమ్‌కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. జిమ్ నుండి బయటకు వచ్చిన సమయంలో రష్మిక కాలికి గాయమై ఇబ్బంది పడుతూ కారు ఎక్కగా, విజయ్ దేవరకొండ మాత్రం సహాయం చేయకుండా కారు లోపల కూర్చోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు విజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే, విజయ్‌ను ట్రోల్ చేస్తున్న వారికి సమాధానం ఇచ్చేలా రష్మిక “దయగా ఉండండి” అంటూ ఈ పోస్ట్ పెట్టిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

rashmika vijay

ప్రస్తుతం రష్మిక మందన్నా వరుస సినిమాలతో కెరీర్‌లో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి భారీ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్‌లో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఆమె ప్రస్తుతం ‘ఛావా’ అనే హిస్టారికల్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుండగా, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Google news Rashmika vijay devarakonda

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.