📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Peddi : సరికొత్త రికార్డు సృష్టించబోతున్న ‘పెద్ది’

Author Icon By Sudheer
Updated: March 13, 2026 • 8:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం విడుదలకు ముందే సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. సాంకేతిక హంగుల విషయంలో రాజీ పడకుండా రూపొందుతున్న ఈ సినిమా, టాలీవుడ్ చరిత్రలోనే అడ్వాన్స్‌డ్ డాల్బీ ఫార్మాట్ (Advanced Dolby Format) లో విడుదల కానున్న తొలి చిత్రంగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం, వెండితెరపై సరికొత్త దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించబోతోంది. ఇప్పటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ‘వార్-2’, ‘కాంతార-2’, ‘ది గోట్ (GOAT)’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే ఈ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకోగా, ఇప్పుడు ఆ వరుసలో ‘పెద్ది’ చేరడం తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం.

Read Also : Allu Cinemas Launch: లారీల్లో వెళ్లి సినిమాలు చూసేవాళ్లం: సీఎం రేవంత్

ఈ అడ్వాన్స్‌డ్ డాల్బీ ఫార్మాట్ వల్ల ప్రేక్షకులకు థియేటర్లలో హైపర్ రియలిస్టిక్ వీడియో అనుభూతి కలుగుతుంది. అంటే, తెరపై కనిపించే ప్రతి దృశ్యం అత్యంత సహజంగా, కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. దీనికి తోడు అద్భుతమైన సౌండ్ సిస్టమ్ తోడవ్వడంతో, సినిమాలోని ప్రతి శబ్దం ప్రేక్షకుడిని కథలో భాగం చేసేలా ఉంటుంది. ఉత్తర ఆంధ్ర నేపథ్యంలో సాగే ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాలో విజువల్స్ మరియు ఆడియో క్వాలిటీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సాంకేతికత పరంగా టాలీవుడ్‌ను మరో మెట్టు ఎక్కించబోతున్న ‘పెద్ది’, బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Peddi peddi dolby system ram charan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.