📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

ఒకరిపై ఒకరు పిర్యాదు చేసుకున్న మంచు మోహన్ బాబు , మనోజ్

Author Icon By Sudheer
Updated: December 9, 2024 • 11:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మంచు మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల గొడవలు ఇప్పుడు పోలీసులు స్టేషన్లలో ఒకరిపై ఒకరు ముప్పు ఉందంటూ పిర్యాదులు చేసుకునే వరకు వచ్చింది. ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు, తన కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై రాచకొండ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన సంఘటన సంచలనంగా మారింది. మోహన్‌బాబు తన ఫిర్యాదులో, తన ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన మంచు మనోజ్, కొంతమంది సంఘవిద్రోహ శక్తులతో కలిసి తిరిగి వచ్చి, తన ఇంటి వద్ద అలజడి సృష్టించారని ఆయన తెలిపారు.

మోహన్‌బాబు ఆరోపణలు ఇలా ఉన్నాయి: “మనోజ్‌కు చెందిన 30 మంది వ్యక్తులు నా ఇంటిలో చొరబడేందుకు ప్రయత్నించారు. నా సిబ్బందిని బెదిరించి ఇంటిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. వారిదే కాదు, మనోజ్ మరియు మౌనికల ఆజ్ఞల మేరకు ఈ చర్యలు జరిగాయి” అని మోహన్‌బాబు పేర్కొన్నారు. దీంతో ఆయన తన నివాసం వద్ద పరిచయం లేని వ్యక్తులుండడంతో ఇంటికి వెళ్లలేకపోయినట్లు చెప్పారు.

మోహన్‌బాబు తన వయసు 78 సంవత్సరాలు అని , ఈ వయసులో ఈ పరిస్థితి తనకు చాలా బాధ కలిగిస్తుందని, తన ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన పోలీసుల సహాయం కోరుతూ, రాచకొండ పోలీసు కమిషనర్, పహాడీ షరీఫ్ ఎస్సై, ఏసీపీ, మహేశ్వరం డీసీపీకి ఫిర్యాదును పంపించారు. అలాగే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ సంఘటనను పరిశీలించాలని, సంఘవిద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇంకా, మంచు మనోజ్ కూడా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ఆయన ఫిర్యాదులో, నిన్న ఉదయం తన ఇంటికి పది మంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని చెప్పారు. వారిని ఆపడానికి ప్రయత్నించగా, ఆయనకు గాయాలు అయ్యాయని, దాడి తర్వాత ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు. అలాగే, సీసీటీవీ ఫుటేజి మాయం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి పోలీసులు ఎంతేలుస్తారో చూడాలి.

Manchu Family news Manchu Manoj Mohan Babu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.