అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ కిష్కింధ(Kishkindha Puri) పురి మరోసారి ప్రేక్షకులను భయపెడుతోంది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా మిరాయ్ వంటి బ్లాక్బస్టర్ల పోటీని ఎదుర్కొని దాదాపు ₹30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్లలో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫారమ్లోనూ అదే స్థాయిలో సంచలనాన్ని సృష్టిస్తోంది.
Read also: Proteins : ప్రోటీన్లు ఉన్నఆహారాన్నే ఎందుకు తినాలి?

ఓటీటీలో 10 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాల రికార్డు
గత వారం (అక్టోబర్ 17) డిజిటల్ ప్రీమియర్గా వచ్చిన కిష్కింధ(Kishkindha) పురి కేవలం తెలుగు భాషలోనే మొదటి వారంలోనే 100 మిలియన్ల (10 కోట్ల) స్ట్రీమింగ్ నిమిషాల రికార్డు సాధించింది. ఇది ఇటీవల కాలంలో తెలుగు హారర్ జానర్లో వచ్చిన సినిమాల మధ్య అరుదైన రికార్డుగా నిలిచింది.
ఓటీటీల్లో సాధారణంగా థియేటర్ హిట్లు పెద్దగా రాణించకపోయినా, ఈ చిత్రం మాత్రం ఆ రూల్ను బ్రేక్ చేసింది. ఉత్కంఠభరితమైన కథా నిర్మాణం, సస్పెన్స్ ట్విస్టులు, అనుపమ పరమేశ్వరన్ ప్రదర్శన సినిమాకు మేజర్ హైలైట్గా నిలిచాయి.
బహుభాషా రిలీజ్తో మరిన్ని రికార్డుల దిశగా
అక్టోబర్ 24నుంచి ఈ సినిమా తెలుగు మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దీంతో ప్రేక్షకుల స్పందన మరింతగా పెరిగింది. అన్ని భాషల ప్రేక్షకులను అలరించే హారర్ ఎలిమెంట్లు, భయపెట్టే సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు అదనపు బలం ఇచ్చాయి. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి రూపొందించిన ఈ సినిమాను సాహు గారపాటి నిర్మించారు. సుదర్శన్, హైపర్ ఆది, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కిష్కింధ పురి సినిమా ఎప్పుడు ఓటీటీలో విడుదలైంది?
అక్టోబర్ 17న తెలుగు భాషలో డిజిటల్ ప్రీమియర్ అయింది.
ఈ సినిమా ఎంత స్ట్రీమింగ్ రికార్డు సాధించింది?
మొదటి వారంలోనే 10 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలు సాధించింది.
కిష్కింధ పురి సినిమాకు దర్శకుడు ఎవరు?
కౌశిక్ పెగళ్లపాటి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: