కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రస్తుతం టాప్ ఫామ్లో ఉన్నారు. కాంతార భారీ విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ క్రేజ్ని సక్సెస్ఫుల్గా ఉపయోగించుకుంటూ వరుసగా పాన్ ఇండియా చిత్రాలను లైన్లో పెట్టారు. కన్నడ భాష నుంచి రీజినల్ స్థాయిలో విడుదలైన కాంతార తరువాత, తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో కూడా అద్భుతమైన వసూళ్లు సాధించడంతో రిషబ్ ఒక్కసారిగా నేషనల్ లెవల్ స్టార్గా మారిపోయారు. నటుడు, దర్శకుడిగా రాణించిన ఆయన, ఈ విజయానంతరం ప్రీక్వెల్గా కాంతార ఛాప్టర్ 1 ను ప్రేక్షకులకు అందించారు.
Read Also: WhatsApp: నటి పేరుతో నకిలీ వాట్సప్..అప్రమత్తంగా ఉండాలన్న శ్రియ
రిషబ్ శెట్టి – కొత్త సినిమాలపై ఉన్న సందేహాలకు ఎండ్
కాంతార ఛాప్టర్ 1 రిలీజ్ తరువాత రిషబ్(Rishabh) తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్న అభిమానుల్లో, ట్రేడ్లో నెలకొంది. ఇప్పటికే పాన్ ఇండియా బ్లాక్బస్టర్ హనుమాన్ కు సీక్వెల్గా రూపుదిద్దుకుంటున్న జై హనుమాన్ సినిమాలో ప్రధాన పాత్రను పోషించేందుకు రిషబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్తోనే సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాక, బాలీవుడ్ నిర్మాత సందీప్ సింగ్ నిర్మించనున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం కూడా రిషబ్ లైన్లో ఉంది. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్లో ఏది ముందుగా సెట్స్ మీదకు వెళుతుందన్న సందేహానికి ఇప్పుడు స్పష్టమైన సమాధానం వచ్చింది.
జనవరిలో జై హనుమాన్ షూటింగ్ ప్రారంభం
ప్రస్తుతం జరుగుతున్న కాంతార ఛాప్టర్ 1 ప్రమోషన్లలో మాట్లాడుతూ, తన తదుపరి ప్రాజెక్ట్ జై హనుమాన్ అని రిషబ్ శెట్టి అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జనవరిలో ప్రారంభమవుతుంది. చిత్రం కోసం రిషబ్ మొత్తం ఐదు నెలల డేట్స్ కేటాయించారు. జై హనుమాన్ పూర్తయ్యాక ఆయన వెంటనే ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమా షూట్ను ఆరంభించనున్నట్లు సమాచారం. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వరుసగా అనౌన్స్ చేసిన సినిమాల్లో ఏది మొదట సెట్స్ మీదకు వెళుతుందన్న గందరగోళం కూడా ఈ అప్డేట్తో తొలగింది. జై హనుమాన్ త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని మేకర్స్ వెల్లడించడంతో, ప్రశాంత్ వర్మ తదుపరి సినిమా ఇదేనని స్పష్టమైంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :