हिन्दी | Epaper

Padma Bhushan : హీరో అజిత్‌కి పద్మభూషణ్ పురస్కారం

Sudheer
Padma Bhushan : హీరో అజిత్‌కి పద్మభూషణ్ పురస్కారం

ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ భారత ప్రభుత్వ నుండి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఘన కార్యక్రమంలో, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన అజిత్ తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ, “ఇలాంటి గౌరవప్రదమైన అవార్డు అందుకోవడం నా జీవితంలో ఒక గొప్ప ఘట్టం. ఇది నా దేశం పట్ల నా కృషికి ఇచ్చిన గుర్తింపు మాత్రమే కాదు, నా సినీ ప్రయాణంలో తోడ్పడిన ప్రతిఒక్కరి సహకారానికి ప్రతిఫలం” అని వ్యాఖ్యానించారు.

Read Also : Padma Bhushan : పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ

సినిమా రంగంలో అజిత్ విజయయాత్ర

2025 సంవత్సరం అజిత్ సినిమాలకు ప్రత్యేకమైనదిగా నిలిచింది. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన “విడాముయర్చి” చిత్రం, అలాగే అధిక్ రవిచంద్రన్ రూపొందించిన “గుడ్ బాడ్ అగ్లీ” సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోడమే కాక, బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించాయి. ఈ విజయాలతో అజిత్ తన నటనతో మరోసారి ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. ఒక్క సినిమాల్లోనే కాకుండా, వ్యక్తిత్వ పరంగా తన సమర్పణతో కూడా అజిత్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు.

రేసింగ్ రంగంలో అజిత్ ఘనతలు

సినీ రంగంతో పాటు ఆటలో కూడా అజిత్ తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన రేసింగ్ టీం “అజిత్ కుమార్ రేసింగ్” జనవరిలో అబూధాబిలో జరిగిన 24 గంటల రేసులో 991 విభాగంలో మూడవ స్థానాన్ని సాధించింది. అంతేకాకుండా, ‘స్పిరిట్ ఆఫ్ ది రేస్’ అనే ప్రత్యేక పురస్కారాన్ని కూడా అందుకుంది. అలాగే బెల్జియంలోని ప్రసిద్ధ స్పా-ఫ్రాంకోర్చాంప్స్ ట్రాక్‌లో జరిగిన మరో రేసులో రెండవ స్థానం గెలుచుకుంది. ఈ విజయాలతో అజిత్ సినీ రంగంతో పాటు స్పోర్ట్స్ రంగంలో కూడా తనదైన ముద్ర వేశాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870