📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైనికుల పిల్లలకు యాభై శాతం స్కాలర్ షిప్ -మంచు విష్ణు

Author Icon By Sudheer
Updated: January 26, 2025 • 7:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు రిపబ్లిక్ డే సందర్భంగా సైనికుల కుటుంబాలకు అండగా నిలిచే మంచి పనికి శ్రీకారం చుట్టాడు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల పిల్లల కోసం మోహన్ బాబు యూనివర్సిటీలో 50 శాతం స్కాలర్‌షిప్‌ను అందించనున్నట్లు ప్రకటించాడు. సైనికుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ, వారి పిల్లల విద్యకు తోడ్పాటుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ప్రశంసలందుకుంటోంది. సైనికుల సేవలను స్మరించుకుంటూ, ఈ నిర్ణయం ద్వారా ఇతర విద్యా సంస్థలు కూడా స్పూర్తి పొందాలని విష్ణు ఆశించాడు. మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదాలు ఇటీవల వార్తల్లో నిలిచినప్పటికీ, ఈ సానుకూల చర్యకు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విష్ణు నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

vishnu

ఇది మాత్రమే కాకుండా, విష్ణు తన దత్తత పిల్లల గురించి కూడా ఇటీవల వీడియో ద్వారా వెల్లడించాడు. 120 మంది పిల్లల్ని దత్తత తీసుకుని, వారికి ఉచిత విద్యా, వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తన పనుల ద్వారా మరికొందరికి స్పూర్తి కలిగించాలని కోరారు. తాను చేస్తున్న మంచి పనులు ఇతరులను ప్రేరేపిస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రతి సోమవారం కొత్త పోస్టర్ విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రీసెంట్‌గా కాజల్ అగర్వాల్‌ను పార్వతీ మాతగా, అక్షయ్ కుమార్‌ను పరమేశ్వరుడిగా పరిచయం చేశారు. ఏప్రిల్ 25న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, విష్ణు సమాజం కోసం చేస్తున్న సేవలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

Fifty percent scholarship Manchu Vishnu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.