టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి భారీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తించారు. తన కెరీర్లో అత్యంత కీలకమైన ఇద్దరు హీరోలతో కలిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన దర్శకత్వంలో మొదటిసారి 100 కోట్ల వసూళ్లను సాధించిన ‘ఎఫ్ 2’ హీరో విక్టరీ వెంకటేశ్, అలాగే దర్శకుడిగా తనకు మొదటి అవకాశం ఇచ్చి ‘పటాస్’ వంటి హిట్ అందించిన నందమూరి కళ్యాణ్ రామ్.. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఈ క్రేజీ మల్టీస్టారర్ రూపుదిద్దుకోనుంది. ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియోలో, తన ఎదుగుదలకు కారణమైన హీరోలతో మళ్ళీ పని చేయడంపై అనిల్ రావిపూడి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Velugumatla House Collapse : కాంగ్రెస్ కూలగొట్టిన చోటే..ఇళ్లు కట్టిస్తాం – కేటీఆర్
వరుసగా రెండేళ్ల నుంచి సంక్రాంతి సీజన్లో అద్భుతమైన విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి, ఈ కొత్త సినిమాను కూడా 2027 సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్లు స్పష్టం చేశారు. పండుగ పూట ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించడంలో అనిల్ దిట్ట కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కామెడీ మరియు మాస్ ఎలిమెంట్స్ను సమపాళ్లలో కలిపి వెంకటేశ్ టైమింగ్ను, కళ్యాణ్ రామ్ ఎనర్జీని ఎలా వాడుకుంటారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు, టైటిల్ మరియు ఇతర నటీనటుల సమాచారం త్వరలోనే వెల్లడి కానుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :