ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అరుదైన గౌరవం దక్కింది. ఉడుపిలోని పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదుగా ఆయనకు ‘అభినవ కృష్ణ దేవరాయ’ అనే విశిష్ట బిరుదు ప్రదానం చేయబడింది. మఠం ఆధ్వర్యంలో జరిగిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్వామీజీ ఈ గౌరవాన్ని ప్రకటించారు. చారిత్రక విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు కళలు, ధర్మానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో, అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా సమాజ హితానికి, ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నారని గుర్తించి స్వామీజీ ఈ బిరుదును అందించినట్లు తెలుస్తోంది. ఈ గౌరవం పవన్ కళ్యాణ్ రాజకీయ, ఆధ్యాత్మిక నేపథ్యానికి మరింత బలాన్ని చేకూర్చే అంశంగా పరిగణించవచ్చు.
News Telugu: DRDO: లక్షన్నర జీతాలతో డీఆర్డీఓలో భారీగా ఉద్యోగాలు
‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన భగవద్గీత యొక్క ప్రాధాన్యతను గురించి లోతుగా వివరించారు. భగవద్గీత అనేది కేవలం ఒకసారి చదివి, ఆ తర్వాత ఎర్రటి వస్త్రంలో చుట్టి పూజా గదిలో దాచిపెట్టే గ్రంథం కాదని ఆయన స్పష్టం చేశారు. దీనిని కేవలం ఒక మత గ్రంథంగా చూడటం సరికాదని, ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత జ్ఞాన నిధిగా అభివర్ణించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com