Money laundering case.. ED summons Robert Vadra

Robert Vadra : మనీలాండరింగ్‌ కేసు.. రాబర్ట్‌ వాద్రాకు ఈడీ సమన్లు

Robert Vadra : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు మరోసారి ప్రముఖ పారిశ్రామిక వేత్త, వయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు సమన్లు జారీ చేశారు. హర్యానాలోని శిఖోపూర్‌ భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈ సమన్లు పంపారు. అయితే, ఈ కేసులో ఏప్రిల్‌ 8న మొదటిసారి జారీ చేసిన సమన్లును వాద్రా దాటవేయడంతో.. ఇప్పుడు రెండోసారి జారీ చేశారు.

Advertisements
మనీలాండరింగ్‌ కేసు రాబర్ట్‌ వాద్రాకు

అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తా

ఈక్రమంలోనే మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేస్తూ.. తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నోటీసులు అందిన అనంతరం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. నేను ప్రజలపక్షాన గొంతు వినిపించిన ప్రతీసారీ.. వాళ్లు నన్ను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తాను అని రాబర్ట్‌ పేర్కొన్నారు.

శిఖోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు

కాగా, వాద్రా కంపెనీ ఫిబ్రవరి 2008లో ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీస్‌ నుంచి రూ.7.5 కోట్లకు గుర్గావ్‌లోని శిఖోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అనంతరం ఈ భూమిని వాద్రా కంపెనీ రూ.58 కోట్లకు రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కి విక్రయించింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. దీంతో విచారణకు రావాల్సిందిగా వాద్రాను ఈడీ ఆదేశించింది.

Read Also: అయోధ్య రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడ

Related Posts
భారత ప్రభుత్వం నుంచి కేరళ నర్సు నిమిషా ప్రియాకు మద్దతు
nimisha

యెమెన్ రాష్ట్రపతి రషాద్ అల్-అలిమి, భారత నర్స్ నిమిషా ప్రియా పై మృతి శిక్షను ఆమోదించారు. 2017 నుండి జైలులో ఉన్న ప్రియా, ఒక యెమెనీ జాతీయుని Read more

డోమినికా ప్రధానమంత్రి మోడీకి అత్యున్నత గౌరవం ఇవ్వనుంది
Shri Narendra Modi Prime Minister of India

కామన్వెల్త్ ఆఫ్ డోమినికా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన అత్యున్నత జాతీయ గౌరవాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ గౌరవం, ప్రధానమంత్రి మోడీ COVID-19 మహమ్మారి సమయంలో Read more

ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు సమావేశాలు
ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు (జనవరి 19) దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) సదస్సులో పాల్గొనడానికి బయలుదేరుతున్నారు. ఈ సదస్సులో భాగస్వాములు Read more

పరీక్షా పై చర్చ 2025: ప్రధాని మోదీని కలిసే అవకాశం!
పరీక్షా పే చర్చ 2025: ప్రధాని మోదీని కలిసే అవకాశం!

భారతదేశంలో ప్రతి విద్యార్థి ఎదురు చూస్తున్న ఆత్మీయ ముఖాముఖీ గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీతో పరీక్షా పై చర్చా 2025. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×