Revanth Reddy : ఢిల్లీలో ఉండే మోడీ రండీ తేల్చుకుందాం..రేవంత్

Read Time:  1 min
Revanth Reddy : ఢిల్లీలో ఉండే మోడీ రండీ తేల్చుకుందాం..రేవంత్
FONT SIZE
GET APP

తెలంగాణలో రైతు సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎవరు ఎంత చేశారో తేల్చుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలను బహిరంగ చర్చకు ఆహ్వానించారు. “మోడీ (Modi) గల్లీలో ఉన్నా, కేడీ ఢిల్లీలో ఉన్నా… రైతు సమస్యలపై ముఖాముఖీకి రావాలండి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కేవలం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం తమ ప్రభుత్వ విజయాన్ని చూపుతున్నదని సీఎం స్పష్టం చేశారు. ఇది వ్యవసాయ రంగాన్ని దండుగ నుంచి పండుగగా మార్చిందని గర్వంగా ప్రకటించారు.

Revanth Reddy : ఢిల్లీలో ఉండే మోడీ రండీ తేల్చుకుందాం..రేవంత్
Revanth Reddy : ఢిల్లీలో ఉండే మోడీ రండీ తేల్చుకుందాం..రేవంత్

ఉచిత కరెంట్‌, రుణ మాఫీతో రైతులకు భరోసా

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాతో పాటు, రుణ మాఫీ, ధాన్యం కొనుగోలు వంటి పథకాలు తమ ప్రభుత్వమే అమలు చేసిందని రేవంత్ వివరించారు. ఈ చర్యల వల్ల రైతులకు ఆర్థిక భద్రత కలుగుతోందన్నారు.ఈ ఏడాది రైతులు 2 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేశారని సీఎం గుర్తు చేశారు. ఈ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులకు సరైన ధర అందేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇది రైతుకు నష్టమేకాకుండా లాభాన్ని చేకూర్చిందని తెలిపారు.

సామాజిక న్యాయ విజయభేరి సభలో కీలక ప్రకటనలు

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు కాంగ్రెస్‌ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని సీఎం చెప్పారు. రైతులకు మెరుగైన జీవితం అందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు.

Read Also : Assembly Elections : 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలుస్తాం – సీఎం రేవంత్

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.