हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Amaravati Relaunch : సీఎం చంద్రబాబుపై మోడీ ప్రశంసలు

Sudheer
Amaravati Relaunch : సీఎం చంద్రబాబుపై మోడీ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై, వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ, దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న పుణ్యభూమిలో ప్రజలను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి అభినందనలు తెలిపారు. శంకుస్థాపన చేసిన రూ.60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు కేవలం నిర్మాణాలు కాదని, అవి ఏపీ అభివృద్ధికి పునాదులని తెలిపారు.

ఐటీ, గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమలు, వైద్యం, విద్య వంటి రంగాల్లో అమరావతి ప్రత్యేక గుర్తింపు

అమరావతి ఒక నగరం కాదు, అది ఒక శక్తి అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ రాజధానిని ఆధునికతకు ప్రతీకగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమలు, వైద్యం, విద్య వంటి రంగాల్లో అమరావతి ప్రత్యేక గుర్తింపు పొందనుందని తెలిపారు. చంద్రబాబు నాయుడిని ప్రశంసించిన మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాదు ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పెద్ద ప్రాజెక్టుల అమలులో చంద్రబాబు అనుభవాన్ని కొనియాడారు.

నాయుడుపేట–రేణిగుంట హైవే ప్రాజెక్టు

వికసిత భారత్ లక్ష్యంలో ఏపీ ముఖ్యపాత్ర పోషించాలని ప్రధాని తెలిపారు. ఎన్టీఆర్ కలల అమలే తమ లక్ష్యమని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని పేర్కొన్నారు. నాయుడుపేట–రేణిగుంట హైవే ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో రైలు, రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరచేందుకు కేంద్రం వేల కోట్ల రూపాయలతో సహకరిస్తోందని వివరించారు. అమరావతి పునర్నిర్మాణం ద్వారా రాష్ట్రం నవ్యాంధ్ర రూపంలో వికసిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also : India War : పాక్ స్టాక్ మార్కెట్ కుదేల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870