హైదరాబాద్ నగరం మళ్ళీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించబోతుంది. మే 10వ తేదీ నుంచి 31 వరకు చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ 2025 పోటీలు నిర్వహించనున్నారు. ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా నుంచే అనేక దేశాల నుంచి పాల్గొనే అందాల భామలు, ప్రముఖ అతిథులు ఇప్పటికే నగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టబడ్డాయి.
చార్మినార్ ప్రాంతంలోని చిన్నచిన్న దుకాణాల మూసివేత
సౌత్ జోన్ పోలీసులు చార్మినార్ ప్రాంతంలోని తోపుడు బండ్ల వ్యాపారాలను, చిన్నచిన్న దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. పోటీలు పూర్తయ్యే వరకు వ్యాపార కార్యకలాపాలు ఆపాలని సూచించగా, వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారు. పాతబస్తీ మొత్తం జోన్లో పెట్రోలింగ్, డ్రోన్ నిషేధం, ట్రాఫిక్ నియంత్రణ వంటి చర్యలు అమలు చేస్తున్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ భద్రతా కారణాల వల్ల డ్రోన్లు, పారా గ్లైడర్లు వంటివి ఎగరవేసేందుకు అనుమతి లేదని ఉత్తర్వులు జారీ చేశారు.
అంతర్జాతీయ ఈవెంట్ విజయవంతం కావడానికి కృషి
వైపు స్థానిక వ్యాపారులు ఈ తాత్కాలిక మూసివేత వల్ల తమ ఆదాయంపై ప్రభావం చూపుతుందని వాపోతున్నా, అంతర్జాతీయ ఈవెంట్ విజయవంతం కావాలని ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. మరోవైపు, మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న కాలంలో భాగ్యనగరంలోని పలు పర్యాటక ప్రాంతాల్లో విదేశీయుల రాకపోకలు పెరగనున్నందున, ప్రభుత్వం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటోంది. చార్మినార్ ప్రాంతం మళ్ళీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also : Health: మైగ్రేన్ తో బాధపడుతున్నారా అయితే ఈ టిప్స్ మీకే