విద్యుత్ షాక్‌

Medak District : దేవాలయంలో విద్యుత్ షాక్‌ తో వ్యక్తి మరణం

మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో దేవాలయాన్ని క్లీన్ చేస్తుండగా, పక్కన ఉన్న స్తంభం యొక్క సపోర్ట్ వైర్ తగిలి గ్రామానికి చెందిన కిచ్చయ్య గారి మాధవరెడ్డి (73) విద్యుత్ షాక్‌ తగిలి మృత్యువాత పడ్డాడు.

మృతుడు మాధవరెడ్డి

మృతుడు మాధవరెడ్డి అతని భార్య భారతమ్మ. ప్రతిరోజు దేవాలయాన్ని శుభ్రం చేస్తుంటారు. సుమారు 15 సంవత్సరాలుగా ఇద్దరు దంపతులు హనుమాన్ దేవాలయానికి సేవ చేస్తూ జీవనం గడుపుతుంటారు.

భార్య భారతమ్మ రోదనలు

ఈరోజు ప్రమాదవశాత్తు ఇలా మాధవరెడ్డి మృత్యువాత పడడంతో భార్య భారతమ్మ రోదనలు మిన్నంటాయి.

కుటుంబ సభ్యులు

ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు జీవనోపాధి నిమిత్తం హైదరాబాదులో ఉంటారు.

ఉగాది పర్వదినంలో విషాదం

ఉగాది పర్వదినాన గ్రామంలో ఇలా దేవాలయం ఆవరణలో వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related Posts
చంద్రబాబు ను కలిసిన బిఆర్ఎస్ నేతలు
tigala krishnareddy

మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డిలు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా తీగల..తాను టిడిపిలో చేరబోతున్నట్లు తెలిపాడు. సోమవారం జూబ్లీహిల్స్ Read more

కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్
cm revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం దిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా హాజరుకానున్నారు. రాష్ట్ర Read more

రేవంత్ రెడ్డి మాదిరి లుచ్చా పనులు చేయలేదు – కేటీఆర్
ktr tweet

తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) విచారణ కోసం తన నివాసం నుంచి కార్యాలయానికి బయలుదేరారు. తన ఇంటికి వచ్చిన పార్టీ Read more

తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది – కేటీఆర్
Will march across the state. KTR key announcement

కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన ట్వీట్ చేసారు. రియల్ ఎస్టేట్ రంగంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కేటీఆర్ చేసిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *