Mal Reddy: విద్యతోనే ఉజ్వల భవిష్యత్ : ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

Read Time:  1 min
Mal Reddy: విద్యతోనే ఉజ్వల భవిష్యత్ : ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
FONT SIZE
GET APP

రంగారెడ్డి జిల్లా : విద్యార్థులు

పాఠశాల దశనుండే క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నతం గా ఎదగాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొ న్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయం జాల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాఠ్యపుస్తములు యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నతనం నుండి క్రమ శిక్షణతో, శ్రద్ధతో చదువుకోవాలని, అదేవిధంగా చదువుతో పాటు ఆటలలో ఉత్సాహంగా పాల్గొనాలన్నారు.

విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల లో చేరే విధంగా ప్రోత్సహించాలి

తుర్కయం జాల మున్సిపాలిటీలో పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల లో చేరే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. నేడు విద్యా వైద్యం ఖర్చులు పెరిగి మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బం దులు పడుతున్నారని ప్రభుత్వం పాఠశాలలో ఎటువంటి ఫీజులు సమస్యలు లేకుండా ఉత్తీర్ణత కలిగిన ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారని కావున పేద మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశా లలో చేర్పించాలని అన్నారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధమేనని తెలిపారు. కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి. మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్ పర్సన్ గుండ్ల పల్లి హరిత ధనరాజ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొక్క వంశీధర్ రెడ్డి, ఎండి గౌస్ పాషా, ప్రధానోపాధ్యాయులు టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Read also: Farmers Death: పిడుగుపాటుకు ఆరుగురు వ్యవసాయ కార్మికుల మృతి

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.