LPG Rate : పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలు మరింత కుదేలు చేస్తున్నాయి. 2014లో కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. గ్యాస్, పెట్రో ధరల పెంపులో మోడీ సర్కారు కొత్త రికార్డులను నమోదు చేసింది.

ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ తొలి స్థానం
ప్రపంచంలో మరే ఇతర దేశాధినేతకు సాధ్యంకాని ఫీట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంతం చేసుకొన్నారు. ప్రజలపై ఇంధన భారాన్ని అత్యధికంగా మోపిన ప్రధానుల్లో మోడీ నంబర్ 1 ప్లేస్లో నిలిచారు. అంతేకాదు.. ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో నిలిచింది. అలాగే పెట్రోల్ రేటులో మూడు, డీజిల్ రేటులో ఎనిమిదో స్థానాన్ని సాధించింది. ఈ మేరకు నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ప్రజల కొనుగోలు శక్తితుల్యత (పర్చేజింగ్ పవర్ పారిటీ-పీపీపీ) విధానాన్ని బట్టి ఏఐ చాట్బాట్ ‘గ్రోక్’ సమాధానాలు ఇచ్చింది.
భారత్లోనే ఎల్పీజీ సిలిండర్ ధర అత్యధికం
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంలో ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందున్నారు. పదకొండేండ్ల మోడీ పాలనలో దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ఆధారంగా ఈ విషయం స్పష్టమవుతున్నది. పీపీపీ ఆధారంగా గణిస్తే.. ప్రపంచ దేశాల్లోకెళ్లా భారత్లోనే ఎల్పీజీ సిలిండర్ ధర అత్యధికంగా ఉన్నది. భారత్లో ఒక సిలిండర్ను కొనుగోలు చేయడానికి 43 పీపీపీ డాలర్లను వెచ్చించాల్సి వస్తున్నది. అమెరికా, బ్రిటన్, చైనాతో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలతో పోల్చిచూసినా ఇది ఎంతో ఎక్కువ.
Read Also : వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్టు !