LPG rates in India are the highest in the world!

LPG Rate : ప్రపంచంలో ఎల్పీజీ రేటు భారత్‌లోనే ఎక్కువ !

LPG Rate : పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను పెరిగిన గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు మరింత కుదేలు చేస్తున్నాయి. 2014లో కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. గ్యాస్‌, పెట్రో ధరల పెంపులో మోడీ సర్కారు కొత్త రికార్డులను నమోదు చేసింది.

Advertisements
ప్రపంచంలో ఎల్పీజీ రేటు భారత్‌లోనే

ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ తొలి స్థానం

ప్రపంచంలో మరే ఇతర దేశాధినేతకు సాధ్యంకాని ఫీట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంతం చేసుకొన్నారు. ప్రజలపై ఇంధన భారాన్ని అత్యధికంగా మోపిన ప్రధానుల్లో మోడీ నంబర్‌ 1 ప్లేస్‌లో నిలిచారు. అంతేకాదు.. ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ తొలి స్థానంలో నిలిచింది. అలాగే పెట్రోల్‌ రేటులో మూడు, డీజిల్‌ రేటులో ఎనిమిదో స్థానాన్ని సాధించింది. ఈ మేరకు నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ప్రజల కొనుగోలు శక్తితుల్యత (పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ-పీపీపీ) విధానాన్ని బట్టి ఏఐ చాట్‌బాట్‌ ‘గ్రోక్‌’ సమాధానాలు ఇచ్చింది.

భారత్‌లోనే ఎల్పీజీ సిలిండర్‌ ధర అత్యధికం

గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడంలో ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందున్నారు. పదకొండేండ్ల మోడీ పాలనలో దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ (పీపీపీ) ఆధారంగా ఈ విషయం స్పష్టమవుతున్నది. పీపీపీ ఆధారంగా గణిస్తే.. ప్రపంచ దేశాల్లోకెళ్లా భారత్‌లోనే ఎల్పీజీ సిలిండర్‌ ధర అత్యధికంగా ఉన్నది. భారత్‌లో ఒక సిలిండర్‌ను కొనుగోలు చేయడానికి 43 పీపీపీ డాలర్లను వెచ్చించాల్సి వస్తున్నది. అమెరికా, బ్రిటన్‌, చైనాతో పాటు పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ వంటి దేశాలతో పోల్చిచూసినా ఇది ఎంతో ఎక్కువ.

Read Also : వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్టు !

Related Posts
21వ శతాబ్దం భారత్‌దే : ప్రధాని మోడీ
21st Century Ice India.. PM Modi

పారిస్ : ప్రధాని మోడీ భారత ఇంధన వార్షికోత్సవాలు 2024 ను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..భారత్‌ తన సొంత వృద్ధినే కాకుండా.. ప్రపంచ వృద్ధి రేటను Read more

హమాస్ విడుదల చేసిన మృతదేహం తల్లి కాదని ఇజ్రాయెల్ స్పష్టం
హమాస్ విడుదల చేసిన మృతదేహం తల్లి కాదని ఇజ్రాయెల్ స్పష్టం

ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకారం, హమాస్ అప్పగించిన నాలుగు మృతదేహాల్లో ఇద్దరు పిల్లలవి అని ఫోరెన్సిక్ పరిశీలన ద్వారా నిర్ధారణ జరిగింది. ఏరియెల్, ఖీర్ బిబాస్‌ల మృతదేహాలు గుర్తించి, Read more

బడ్జెట్ లో తెలంగాణకు చిల్లి గవ్వ కూడా రాలే : కేటీఆర్‌
ktr response to Central Budget

హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌ పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో Read more

వయనాడ్‌ మృతులకు కేరళ సర్కార్‌ పరిహారం
wayanad disaster

కేరళలోని వయనాడ్‌లో గతేడాది సంభవించిన ఘోరవిపత్తు ఘటనపై పినరయి విజయన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతైన వారిని మృతులుగా ప్రకటించాలని నిర్ణయించింది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×