విజయవాడ : మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపి పుట్టా మహేష్ దొరకడం సిగ్గుచేటని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. ఆయనను తక్షణం అరెస్ట్ చేయాలన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేసారు. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంటే ఈ ఎంపి ఇక్కడ కొకైన్ తో విందు చిందు చేస్తున్నాడన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి భాద్యతారాహిత్యం? అని ప్రశ్నించారు. డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది కదా..
Read also: Anganwadi : ఏపీలోని అంగన్వాడీలకు శుభవార్త

YS Sharmila: Take action against MP Putta Mahesh.
ఇప్పుడు చంద్రబాబు ఎం చర్యలు తీసుకుంటారు?
డ్రగ్స్ తీసుకుంటూ పట్టబడ్డ ఎంపి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? యువత డ్రగ్స్ వాడాలని ఎంపి ఎంకరేజ్ చేస్తున్నారా? అని షర్మిల ప్రశ్నించారు. ఓట్లేసి గెలిపించిన ఏలూరు. ప్రజలకు ఎంపి ఏం సమాధానం చెప్తారు? ఎంపీ పదవి నుంచి పుట్టా మహేషు వెంటనే తొలగించాలన్నారు. సిఎంకు చిత్తశుద్ది ఉంటే ఎంపిని పార్టీ నుంచి వెంటనే నస్పెండ్ చేయాలన్నారు. డ్రగ్స్ నిజంగా ఉక్కుపాదం మోపితే ఎంపి పై చర్యలు తీసుకొని చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: