Telugu news: Vijayawada: విజయవాడలో భవానీలు, పోలీసుల మధ్య తలెత్తిన వివాదం

Read Time:  1 min
Vijayawada
Vijayawada
FONT SIZE
GET APP

Bhavani Devotees Protest in Vijayawada: విజయవాడ(Vijayawada)లో భవానీలు, పోలీసుల మధ్య తలెత్తిన వివాదం తలెత్తింది. తమకు అన్యాయం జరిగిందంటూ భవానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దాడికి దిగిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండే చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన సుమారు 20 మంది భవానీలు రెండు ఆటోల్లో గుంటూరు జిల్లా తాడేపల్లికి దీక్షకు బయలుదేరారు. ఆటోలు తాడిగడప నుంచి వంద అడుగుల రోడ్డుకు చేరుకునే సరికే వెనుకగా బైక్ పై మఫ్టీలో ఏఆర్ కానిస్టేబుల్ వెళ్తున్నారు. ఒకరు ఆటో వెనుక భాగంలో అజాగ్రత్తగా కూర్చొన్న పిల్లలను సరిగ్గా కూర్చో పెట్టాల్సిందిగా ఆటోడ్రైవరుకు సూచించారు. అదే వ్యక్తి ఆటో అనుసరిస్తూ కానూరు వీఆర్ సిద్దార్ధ కళాశాల వద్దకు చేరుకున్నారు.

Read Also:  Vande Bharat Express : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నరసాపురం వరకు వందేభారత్ ఎక్స్ ప్రెస్

A dispute arose between Bhawanis and the police in Vijayawada.

కానిస్టేబుల్‌పై చర్యలు కోరుతూ భవానీల ఆందోళన

ఈ క్రమంలో బైక్ ను ఆటో ముందు నిలిపి ఫొటో తీయడంతో భవానీలు కిందకు దిగి ఎందుకు ఫొటో తీశారంటూ గొడవకు దిగారు. సెల్ఫోన్ను లాక్కుని నేలకేసి కొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఏఆర్ కానిస్టేబుల్ ఈ విషయాన్ని బెంజిసర్కిల్ ట్రాఫిక్ పోలీసుల(Traffic Police)కు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఆటోను ఆపేందుకు ప్రయత్నించారు. ఆటో దిగిన భవానీలు పోలీసులతో గొడవ పడడంతో వారిని అక్కడి నుంచి పంపేశారు. కాసేపటికి స్క్యూబ్రిడ్జి వద్ద ఆటోలను ట్రాఫిక్ పోలీసులు నిలుపుదల చేయడంతో తామేం తప్పు చేశామని భవానీలు ఆగ్రహించారు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు: కమిషనర్ రాజశేఖరబాబు

తమను కించపరిచే విధంగా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేశారు. అదే సమయంలో వారిలో ఓ బాలిక ఫోన్లో వీడియో తీస్తుండగా గమనించిన పోలీసులు ఫోన్ లాక్కున్నారు. దీంతో భవానీలు మరింత ఆగ్రహించారు. పోలీసులు తమకు క్షమాపణలు చెప్పాలంటూ రోడ్డుపై బైఠాయించారు. నిరసన తెలియజేయడంతో నేషనల్ ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీలు, ఇతర పోలీసులు వారికి సర్ది చెప్పారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు వెంటనే నగరంలోని వివిధ ప్రాంతాల సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను సేకరించారు విచారణ నివేదిక ఆధారంగా ఘటనలో పాల్గొన్న వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవానీ దీక్షల సందర్భంగా భక్తుల భద్రత, గౌరవం, ప్రజా శాంతిభద్రత కాపాడడంలో పోలీసులు ఎప్పుడూ అప్రమత్తం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.