News Telugu: TG: మోదీతో మాట్లాడి ముందుకు సాగుతున్నాం: రేవంత్ రెడ్డి

Read Time:  1 min
We are moving forward after talking to Mod
We are moving forward after talking to Mod
FONT SIZE
GET APP

ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Modi) మాట్లాడిన అనంతరం ఆదిలాబాద్ విమానాశ్రయంపై అధికారిక ప్రకటన చేస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది లోపలే ఈ విమానాశ్రయ నిర్మాణ పనులు మొదలవుతాయని హామీ ఇచ్చారు. జిల్లాలో రూ.260 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ప్రజాసభలో మాట్లాడిన ఆయన, గత రెండు సంవత్సరాలుగా సెలవు లేకుండా పనిచేస్తున్నానని పేర్కొన్నారు.

Read also: TG: ఒకే గ్రామంలో ఇద్దరు సర్పంచులు..

We are moving forward after talking to Mod

We are moving forward after talking to Mod

సున్నపు గనులను ఉపయోగించి

తాము ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నామని రేవంత్ తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత ప్రజల కోసం పని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత ప్రభుత్వం ప్రతిపక్షాలకు అవకాశాలు ఇవ్వలేదని విమర్శించిన ఆయన, ఇప్పుడు మాత్రం అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతున్నామని అన్నారు.

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోదీతో పాటు దేశంలోని ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించామని తెలిపారు. రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే భారీ స్థాయి అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో పరిశ్రమలు తీసుకురావడం, రోడ్డు–విమాన రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని రేవంత్ హామీ ఇచ్చారు.

సోనియా గాంధీ ఆశీర్వాదంతో ఇక్కడకు వచ్చానని పేర్కొన్న ఆయన, ఆదిలాబాద్‌ను నమూనా జిల్లాగా తీర్చిదిద్దే దిశగా త్వరలో సమగ్ర ప్రణాళికతో మరోసారి వస్తానని ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఉన్న సున్నపు గనులను ఉపయోగించి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. తుమ్మిడిహట్టిలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాకు నీటి సమస్య లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

జిల్లాలో విశ్వవిద్యాలయం నిర్మాణానికి తాము సిద్ధమని, అయితే ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నది ప్రజాప్రతినిధులు నిర్ణయించాలని చెప్పారు. తన అభిప్రాయం ప్రకారం ఇంద్రవెల్లి అనుకూలంగా ఉంటుందని సూచించినా, అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. ఆడబిడ్డలకు ఆర్థిక భద్రత కల్పించే పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, మహిళలు ఆనందంగా ఉంటేనే రాష్ట్రానికి మంచి వర్షాలు, మంచి పంటలు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.