Telangana Budget: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పూర్తిగా దిశానిర్దేశం లేనిదిగా ఉందని కల్వకుంట్ల కవిత అభివర్ణించారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే, బడ్జెట్ ప్రసంగంలో వారి గురించి కనీస ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు యువతకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, ఈ బడ్జెట్ నిరుద్యోగ యువతను తీవ్రంగా వంచించిందని ఆరోపించారు.
Read Also: Telangana Budget updates: అప్పుల కుప్ప బడ్జెట్ లెక్కలు చెబుతున్న చేదు నిజం!

అప్పుల భారం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని ధ్వజమెత్తారు. ప్రస్తుత బడ్జెట్ లెక్కల ప్రకారం తెలంగాణలోని ప్రతి వ్యక్తిపై సుమారు రూ. 2.16 లక్షల అప్పు భారం పడుతోందని ఆమె లెక్కలతో సహా వివరించారు. సంక్షేమ పథకాల కంటే అప్పులు తీసుకురావడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు. అభివృద్ధి కంటే అప్పుల ప్రస్తావనే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు.
ఆరు గ్యారెంటీలు.. అటకెక్కిన హామీలు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై బడ్జెట్లో స్పష్టత లేదని కవిత ప్రశ్నించారు. రైతు రుణమాఫీకి అవసరమైన పూర్తి నిధులు కేటాయించలేదని, మహాలక్ష్మి వంటి పథకాలకు బడ్జెట్ కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయడానికే ఈ ‘అంకెల గారడీ’ బడ్జెట్ను రూపొందించారని, ఇది ప్రజాసంక్షేమానికి వ్యతిరేకమైన బడ్జెట్ అని ఆమె స్పష్టం చేశారు. క్యూర్, ప్యూర్ వంటి కొత్త పదజాలంతో ప్రజలను మభ్యపెట్టలేరని ధ్వజమెత్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: