Telugu News: Srinivasa Reddy: ప్రతి మండలానికి లైసెన్స్డ్ సర్వేయర్లు

Read Time:  1 min
Srinivasa Reddy: ప్రతి మండలానికి లైసెన్స్డ్ సర్వేయర్లు
Srinivasa Reddy: ప్రతి మండలానికి లైసెన్స్డ్ సర్వేయర్లు
FONT SIZE
GET APP

హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ‘భూభారతి'(‘Bhubharati’) చట్టం లక్ష్యాలను నెరవేర్చడానికి ప్రస్తుతం ఉన్న 350 మంది సర్వేయర్లు సరిపోరని అధికారులు పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం లైసెన్స్డ్(Licensed) సర్వేయర్లను నియమించడం, సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, ఆధునిక సర్వే పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు చేపడుతోంది. శుక్రవారం సచివాలయంలో రెవెన్యూశాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్, సర్వే విభాగం కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్‌లతో కలిసి ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు.

Read also: G.V. Poornachand: భాషాభ్యుదయం కోసం సంఘటితంగా కృషి చేయాలి

ప్రతి మండలానికి లైసెన్స్డ్ సర్వేయర్లు, సీఎం చేతుల మీదుగా లైసెన్స్ పంపిణీ

తాజాగా క్షేత్రస్థాయిలో ప్రజలకు సులభంగా భూ సేవలు అందించడానికి ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సర్వే మ్యాప్‌ను జతపరచడం తప్పనిసరి కావడంతో సర్వే విభాగం పాత్ర మరింత క్రియాశీలం కానుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు, ఈ నెల 19వ తేదీన శిల్పకళా వేదికలో శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్లకు సీఎం చేతుల మీదుగా లైసెన్స్‌లు పంపిణీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న పది వేల మందిలో, తొలి విడత శిక్షణ పొందిన ఏడు వేల మందిలో 3,465 మంది అర్హత సాధించారు.

Srinivasa Reddy
Srinivasa Reddy

రెండో విడత శిక్షణ, నియామకాలు

రెండో విడతలో మరో మూడు వేల మందికి ఆగస్టు 18 నుంచి శిక్షణ ప్రారంభించారు. ఈ నెల 26వ తేదీన జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో వీరికి అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి 40 రోజుల పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఉంటుంది. వీరి సేవలు కూడా డిసెంబర్ రెండో వారం నాటికి అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.

భూభారతి చట్టం అమలు కోసం ఎంతమంది సర్వేయర్లు అవసరమవుతారు?

ప్రస్తుతం ఉన్న 350 మంది సర్వేయర్లు సరిపోరని, మరికొంత మంది సర్వేయర్లు అవసరమవుతారని అధికారులు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైసెన్స్‌లు ఎప్పుడు పంపిణీ చేయనున్నారు?

ఈ నెల 19వ తేదీన శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్స్‌లు పంపిణీ చేయనున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.