Revanth Reddy: తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం (Telangana) బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో, అప్పటివరకు ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన తీర్మానాన్ని, బిల్లును ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే, ఈ బిల్లు ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. దీనిపై స్పష్టత వచ్చే వరకు ఎన్నికలకు వెళ్లడం సరైనది కాదని కేబినెట్ అభిప్రాయపడింది.
Read also: Telangana Government: అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ..
రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడుతూ, ఎన్నికల హామీ మేరకు బీసీలకు పెంచిన రిజర్వేషన్లు అమలు చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిర్ణయం రాకముందే ఎన్నికలు నిర్వహిస్తే బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని, అందుకే కేంద్రం స్పందన కోసం వేచి చూడాలని సూచించారు. సీఎం ప్రతిపాదనకు మంత్రులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల బిల్లుపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటివరకు రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల సందడి ఉండే అవకాశం లేదు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అటు పార్టీ శ్రేణులు, ఇటు ఆశావహులు మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: