Raghav Chadha: మినిమం బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు చేసిన బ్యాంకులు

Read Time:  1 min
మినిమం బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు చేసిన బ్యాంకులు
మినిమం బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు చేసిన బ్యాంకులు
FONT SIZE
GET APP

బ్యాంకులు పేదోడి బతుకుతో ఆటలాడుతున్నాయి. మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయడం లేదని భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంపై పార్లమెంట్ వేదికగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా గళమెత్తారు. మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కరెంట్ బ్యాంకింగ్ వ్యవస్థపై రాఘవ్ చద్దా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2022-23, 2023-24, 2024-25).. దేశంలోని బ్యాంకులు కనీస ఖాతా నిల్వను ఉంచని ఖాతాదారుల నుంచి రూ.19 వేల కోట్లు వసూలు చేసాయని తెలిపారు. ఆ విధంగా శిక్షలు విధించడం పేద ప్రజలపై ప్రభావం చూపుతుందని.. పొదుపును నిరుత్సాహపరుస్తుందని రాఘవ్ చద్దా (Raghav Chadha) అన్నారు. చాలా మంది పేదవాళ్లు కొన్ని వేల రూపాయల పొదుపును నెలల పాటు క్రమంగా జమ చేస్తారు. కానీ ఒక చిన్న అత్యవసర పరిస్థితిలో, ఆ డిపాజిట్‌లోంచి కొన్ని రూపాయలు ఉపయోగించాల్సి వస్తే.. బ్యాంకులు అదే ఖాతాపై ఫీజులు తీసుకుంటూ వారి పొదుపును తక్కువ చేస్తాయి.

Read Also: Ali larijani death : లరిజానీ మృతి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తం

Raghav Chadha: Banks collected Rs. 19 thousand crores for not having minimum balance
Raghav Chadha: Banks collected Rs. 19 thousand crores for not having minimum balance

పేద ప్రజల జీవితాలను కష్టతరం చేస్తున్నారు: రాఘవ్ చద్దా..

ఉదాహరణగా ఒక ఖాతాదారుడు ఆరు వేల రూపాయలు పొదుపు చేసి, తక్షణ అవసరం కోసం రెండు వేల రూపాయలు వాడుకున్నా, బ్యాంక్ ఆ ఖాతాపై ఫీజు విధించడంతో చివరికి అతని ఖాతాలోని మొత్తం తగ్గిపోతుందని చద్దా తెలిపారు. మొత్తం 600 రూపాయల ఫీజు, ఆ పేదవాడికి ఎంతో ముఖ్యమైనది. ఇది అతని పొదుపును పూర్తిగా అర్థం చేసుకోకుండా దెబ్బతీస్తుందని చద్దా నొక్కి చెప్పారు. పేద ప్రజల జీవితాలను కష్టతరం చేస్తూ, బ్యాంకులు ఫీజులు వసూలు చేయడం, వారి పొదుపును శిక్షించడం అనేది ఆర్థిక సమ్మిళితకు అనుగుణంగా లేదని ఆయన తెలిపారు. ఈ విధమైన జరిమానాలను తొలగించడం ద్వారా పేదలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయవచ్చని, పొదుపు అలవాటును ప్రోత్సహించవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకింగ్ సమస్యలను కూడా చద్దా హైలైట్ చేశారు. చిన్న ఖాతాదారులు 1,000 నుంచి 3 వేల రూపాయల మధ్య నిల్వ ఉంచాల్సి వస్తుందని.. ఆ పై బ్యాంకులు 50 నుంచి 600 రూపాయల వరకు రుసుములు వసూలు చేస్తారని.. అందులో 18 శాతం GST కూడా చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. పేదలు మరింత పేదవారిగా మారుతున్నారు. రైతుల రుణాల మాదిరే, కనీస ఖాతా నిల్వపై విధించే జరిమానాలను కూడా మాఫీ చేయాలని ఆయన స్పష్టంగా అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.